బహ్రెయిన్:చిన్నారిపై కన్నతల్లి పైశాచికత్వం
- June 01, 2018బహ్రెయిన్:26 ఏళ్ళ అరబ్ మహిళ, తన 15 ఏళ్ళ కుమార్తెపై పైశాచికత్వం ప్రదర్శించింది. చిన్నారి కాళ్ళపైనా, అలాగే ప్రైవేట్ పార్ట్స్పైనా నిందితురాలు వాతలు పెట్టింది. తీవ్ర గాయాలతో చిన్నారి ఆసుపత్రి పాలయ్యింది. ఆసుపత్రిలో చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆ చిన్నారికి హెడ్ ఇంజ్యూరీ కూడా అయినట్లు పేర్కొన్నారు. నిందితురాలి భర్త, తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు, తల్లిపై కేసు నమోదు చేశారు. చిన్నారిపై తల్లి దాడికి సంబంధించి, ఆ చిన్నారి తండ్రి గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది. ఆ ఘటనలో చిన్నారి చేయి విరిగిపోగా, ప్రమాదవశాత్తూ కిందపడిపోయిందని తల్లి బుకాయించింది. తల్లి వేధింపుల కారణంగా ఆ చిన్నారి 10 శాతం డిజేబిలిటీకి గురయ్యింది. నిందితురాలికి తన భర్తతో ఏడేళ్ళ కుమారుడు కూడా వున్నాడు. అయితే ప్రమాదవశాత్తూ వేడి నీటిలో చిన్నారి పడిపోయిందంటూ నిందితురాలి తరఫు లాయర్ వాదనలు విన్పించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..