సౌదీ అరేబియా టూ కామారెడ్డి: ప్రేమించినవాడి కోసం వచ్చేసిన యువతి
- June 01, 2018
హైదరాబాద్: అతను సౌదీలో ఓ కారు డ్రైవర్.. ఆమె ఓ బడా కుటుంబానికి చెందిన గారాలపట్టీ.. ఆ కారు డ్రైవర్ నడవడిక చూసి ఆమెకు అతనిపై ప్రేమ కలిగింది. అదే మాట అతనితో చెబితే.. ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయపడ్డాడు. కానీ అన్నింటికి తానే ముందుండి ఎట్టకేలకు ఆమె అతన్నే వివాహం చేసుకుంది. ఇందుకోసం పుట్టిన గడ్డ సౌదీని సైతం వదిలి ఇండియా వచ్చేసింది. సినిమాల్లో ప్రేమ కథలను తలపిస్తున్న ఈ కథ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
సౌదీ టూ కామారెడ్డి ఏంటీ ప్రేమ కథ
కామారెడ్డికి చెందిన అజీబుద్దీన్ అనే యువకుడు బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అక్కడ నసీర్ అనే ఓ బడా వ్యాపారి వద్ద కారు డ్రైవరుగా చేరాడు. ఇదే క్రమంలో అజీబుద్దీన్ నడవడిక నసీర్ కూతురిని ఆకర్షించింది. అతన్ని ప్రేమించింది. మొదట ఆ విషయం అజీబుద్దీన్ తో చెప్పినప్పుడు అతను చాలా కంగారుపడ్డాడు. నీకు నాకు సెట్ కాదనే చెప్పాడు. కానీ ఆమెనే అతనికి ధైర్యం చెప్పించి ఒప్పించింది.
ఇద్దరి వివాహం ముందు అతన్ని పంపించి..
సౌదీలో ఉంటే ఇద్దరు పెళ్లి చేసుకోవడం కష్టం కాబట్టి ఇండియా వచ్చేయాలనుకున్నారు. ఈ క్రమంలో మొదట ఆ యువతి.. అజీబుద్దీన్ ను ఆర్నెళ్ల క్రితం ఇండియా పంపించింది. దీంతో అతను తన స్వస్థలమైన కామారెడ్డికి చేరుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి.. ఆమె కూడా ఇండియా వచ్చేసింది.
నేపాల్ టూ ఇండియా గత నెలలో నిఖా
సౌదీ నుంచి నేరుగా ఢిల్లీ విమానశ్రయంలో దిగితే తన తండ్రికి తెలిసినవారు గుర్తుపడుతారని యువతి భావించింది. దీంతో సౌదీ నుంచి నేపాల్ వెళ్లి అక్కడినుంచి ఇండియాలో అడుగుపెట్టింది. ఢిల్లీ చేరుకున్నాక అజీబుద్దీన్ కి ఫోన్ చేసి తాను వచ్చిన విషయం చెప్పింది. దీంతో అతను ఢిల్లీ వెళ్లి ఆమెను కామారెడ్డికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో గత నెల రెండో వారంలో వారిద్దరు 'నిఖా' చేసుకున్నారు.
తండ్రికి ఫోన్ లో కేసు పెట్టిన తండ్రి..
వివాహం తర్వాత యువతి తన తండ్రికి ఫోన్ ద్వారా విషయం చేరవేసింది. దీంతో హైదరాబాద్ చేరుకున్న నసీర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అజీబుద్దీన్ తనను కిడ్నాప్ చేయలేదని ఇష్టపూర్వకంగానే నిఖా జరిగిందని యువతి పోలీసులతో తెలిపింది. పైగా వారిద్దరు మేజర్లు కావడంతో బలవంతంగా తీసుకురావడం కుదరదని నసీరుద్దీన్కు చెప్పారు. దీంతో చేసేదేమి లేక ఆమె తండ్రి వెనుదిరిగినట్టు సమాచారం.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







