ఒమన్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్
- June 04, 2018
మస్కట్: ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ని మస్కట్లోని బౌషర్ బ్లడ్ బ్యాంక్లో నిర్వహించింది. ట్రస్ట్ సభ్యులు, వారి కుటుంబాలకు చెందినవారు, సన్నిహితులు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఉత్సాహంగా పాల్గొని, రక్తాన్ని అందించారు. పవిత్ర రమదాన్ మాసంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. 120 మంది వరకూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో రక్తాన్ని అందించడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ కృతజ్ఞతలు తెలిపింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ తొలిసారిగా ఒమన్లో, ఎన్టీఆర్ ట్రస్ట్ - హైద్రాబాద్తో కలిసి స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్టీఆర్ ట్రస్ట్ కేంద్ర కార్యాలయం, ఇండియాలోని హైద్రాబాద్లో వుంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు మీద ఈ ట్రస్ట్ పలు రకాలైన సేవల్ని అందిస్తోంది.

తాజా వార్తలు
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ







