ఒమన్ లో బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ నిర్వహించిన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌

- June 04, 2018 , by Maagulf

మస్కట్‌: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఒమన్‌, బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ని మస్కట్‌లోని బౌషర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో నిర్వహించింది. ట్రస్ట్‌ సభ్యులు, వారి కుటుంబాలకు చెందినవారు, సన్నిహితులు ఈ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌లో ఉత్సాహంగా పాల్గొని, రక్తాన్ని అందించారు. పవిత్ర రమదాన్‌ మాసంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. 120 మంది వరకూ ఈ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌లో రక్తాన్ని అందించడం జరిగింది. బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఒమన్‌ కృతజ్ఞతలు తెలిపింది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఒమన్‌ తొలిసారిగా ఒమన్‌లో, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ - హైద్రాబాద్‌తో కలిసి స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ కేంద్ర కార్యాలయం, ఇండియాలోని హైద్రాబాద్‌లో వుంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు మీద ఈ ట్రస్ట్‌ పలు రకాలైన సేవల్ని అందిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com