మిజోరాం:లోయలో పడిన బస్సు.. 11 మంది మృతి
- June 05, 2018
మిజోరాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం పంగ్జ్వాల్ గ్రామ సమీపంలో ఎత్తైన ప్రదేశంలో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. సుమారు 500 మీటర్ల పై నుండి బస్సు కిందపడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ నిద్రపోతుండగా.. క్లీనర్ డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. బస్సు ఐజ్వాల్ నుండి సియాహ వెళ్తోందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







