మిజోరాం:లోయలో పడిన బస్సు.. 11 మంది మృతి
- June 05, 2018
మిజోరాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం పంగ్జ్వాల్ గ్రామ సమీపంలో ఎత్తైన ప్రదేశంలో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. సుమారు 500 మీటర్ల పై నుండి బస్సు కిందపడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ నిద్రపోతుండగా.. క్లీనర్ డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. బస్సు ఐజ్వాల్ నుండి సియాహ వెళ్తోందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







