మిజోరాం:లోయలో పడిన బస్సు.. 11 మంది మృతి

- June 05, 2018 , by Maagulf
మిజోరాం:లోయలో పడిన బస్సు.. 11 మంది మృతి

మిజోరాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం పంగ్జ్వాల్‌ గ్రామ సమీపంలో ఎత్తైన ప్రదేశంలో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. సుమారు 500 మీటర్ల పై నుండి బస్సు కిందపడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ నిద్రపోతుండగా.. క్లీనర్‌ డ్రైవింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. బస్సు ఐజ్వాల్‌ నుండి సియాహ వెళ్తోందని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com