'అబ్బాయితో అమ్మాయి' ఈ నెల 24న విడుదల ..
- December 09, 2015నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్న చిత్రం అబ్బాయితో అమ్మాయి. రమేష్వర్మ దర్శకుడు. వందన అలేఖ్య, కిరిటీ, శ్రీనివాస్ నిర్మాతలు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మల్టీడైమన్షన్ వాసు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఆడియో, ట్రైలర్కు మంచి స్పందన లభిస్తోంది. ఇళయరాజా స్వరపరచిన గీతాలు శ్రావ్యమైన బాణీలతో శ్రోతల్ని అలరిస్తున్నాయి. హృదయానికి హత్తుకునే ప్రేమకథా చిత్రమిదని, తమిళంలో కూడా విడుదల చేయమని ఇళయరాజాగారు సూచించారు. సి. కల్యాణ్గారు తమిళంలో విడుదల చేస్తున్నారు అన్నారు. అన్ని వర్గాల్ని అలరించే హృద్యమైన ప్రేమకథా చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. నాగశౌర్య మాట్లాడుతూ ఇళయరాజా సంగీతాన్నందిస్తున్న 999 చిత్రమిది. సినిమా చూసిన పరిశ్రమ ప్రముఖులు చాలా మంది బాగుందని ప్రశంసించారు. వినోదానికి పెద్దపీట వేస్తూ ప్రేమలోని సున్నితమైన భావాలకు అందమైన దృశ్యరూపంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అన్నారు. పొయెటిక్గా సాగే ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, హృదయానికి హత్తుకునే సన్నివేశాలుంటాయని దర్శకుడు చెప్పారు. బహ్మానందం, రావు రమేష్, మోహన్, ప్రగతి, తులసి, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శ్యాం కె నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మురళీకృష్ణ కొడాలి.
తాజా వార్తలు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్
- ఇంగ్లాండ్ పై అర్జెంటీనా ఘన విజయం..
- గూగుల్ మ్యాప్స్లో కొత్త అప్డేట్..
- కువైట్లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ..అర్హతలు, పెట్టుబడి నిబంధనలు ఇవే
- సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!
- ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు..!!
- సౌదీలో 2025 సుజుకి గ్రాండ్ విటారా కార్లు రీకాల్..!!
- భారతీయ నావికులను పరామర్శించిన దుబాయ్ భారత కాన్సులేట్ అధికారులు..!!







