నవ్యాంధ్ర ప్రజలకు శుభవార్త

- June 07, 2018 , by Maagulf
నవ్యాంధ్ర ప్రజలకు శుభవార్త

అమరావతి:నవ్యాంధ్ర ప్రజలకు శుభవార్త. జులైలో విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చే నెలలో విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సేవలు ప్రారంభించనున్నట్లు సింగపూర్‌ సమాచార శాఖ మంత్రి ఈశ్వరన్‌ ప్రకటించారు.
రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా సింగపూర్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న మూడో అత్యున్నత సమావేశాల్లో పాల్గొనేందుకు సింగపూర్ సమాచార శాఖ మంత్రి ఈశ్వరన్ గురువారం ఉదయం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన సమావేశమయ్యారు. అమరావతిలో స్టార్టప్‌ ప్రాంతం ‘ ఫేజ్‌ జీరో’ అభివృద్ధిపై ఇరువురు చర్చించారు. ఏడీపీ, సింగపూర్‌ కన్సార్షియం మధ్య అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్‌ సిటీని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు తెలిపారు.

సింగపూర్‌ సంస్థలు ముందుకొస్తే ఈ ప్రాజెక్టు మరింత వేగవంతమవుతుందన్నారు. అమరావతికి బృహత్‌ ప్రణాళిక ఇచ్చిన సింగపూర్‌... నిర్మాణంలోనూ భాగస్వామ్యం వహిస్తోందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com