సౌదీ అరేబియా:భారతీయ చిత్రం'కాలా'రిలీజ్!
- June 07, 2018
సౌదీ అరేబియా:తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కాలా' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అయితే రివ్యూలకు సంబంధం లేకుండా రజినీకాంత్ చిత్రాలు ఎక్కడైనా టాప్ లెవెల్లో దూసుకు పోతాయన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం రిలీజ్ కి ముందు నుంచి ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రం కథ మాదే అంటూ కోర్టుకు వెళ్లడం..కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని 'కాలా' రిలీజ్ కి పరిమిషన్ ఇవ్వడం జరిగింది. మరోవైపు కావేరీ జలాల వివాదంలో 'కాలా' చిత్రాన్ని కూడా లాగారు..కన్నడ నాట ఈ చిత్రాన్ని ప్రదర్శించవొద్దని వ్యతిరేకించారు.
ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకొని సినిమాలకు రాజకీయాలకు పొంత పెట్టవొద్దని..సినిమా రిలీజ్ కి ఎలాంటి అడ్డు తీసుకు రావొద్దని తీర్పు ఇచ్చింది. అంతే కాదు థియేటర్ల వద్ద సెక్యూరిటీ కూడా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే..సౌదీ అరేబియాలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం ఇదే కానుంది. నిజానికి 1980ల్లోనే సౌదీ అరేబియాలో సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు.
సినిమాల ప్రదర్శన ఇస్లాంలో జోక్యం చేసుకోవడమేనంటూ వచ్చిన ఒత్తిళ్లకు అక్కడి ప్రభుత్వం తలవొగ్గింది. 35 ఏళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ లో తిరిగి అక్కడ సినిమా ప్రదర్శనలు మొదలయ్యాయి. మొదటి చిత్రంగా బ్లాక్ పాంథర్ విడుదలైంది. అయితే కర్ణాటకలో మాత్రం కాలా చిత్రానికి అడ్డు తగులుతూనే ఉన్నారు.
కాగా, సంప్రదాయవాదం ప్రబలంగా ఉన్న సౌదీ అరేబియాలో ప్రదర్శనకు వెళుతుండడం నిజంగా ఆలోచించతగినదే. దీనిపై రజనీకాంత్ అల్లుడు ధనుష్, కుమార్తె ఐశ్వర్య ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ''ఇది చాలా పెద్ద విషయం. సౌదీ అరేబియా రాజ్యంలో విడుదల అవుతున్న మొదటి భారతీయ సినిమా కాలా. ఇది కేవలం తలైవర్ కే సాధ్యం'' అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







