దక్షిణి సాగ్
- June 07, 2018
కావలసినవి: బీన్స్ 100 గ్రాములు (డైమండ్ ఆకారంలో తరిగి), క్యారెట్ 100 గ్రాములు (డైమండ్ ఆకారంలో తరిగి), కాలీఫ్లవర్ పువ్వులు 100 గ్రాములు, పచ్చి బఠాణీ 50 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 50 గ్రాములు, టొమాటొ 100 గ్రాములు (సన్నగా తరిగి), వెల్లుల్లి 30 గ్రాములు (సన్నగా తరిగి), పాలకూర 800 గ్రాములు, వాము ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి నాలుగు, కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం ఒక టేబుల్ స్పూన్, నూనె 50 గ్రాములు, రెండు కాయల తాజా నిమ్మరసం.
ఎలా చేయాలి: కూరగాయలన్నింటిని కలిపి వేడినీటిలో ముంచి తీసి తరువాత చల్లటి నీటిలో వేసి పక్కన ఉంచుకోవాలి. పాలకూరను వేడినీటిలో ముంచి నీటిని పిండి సన్నగా తరిగి పెట్టుకోవాలి. వేడిచేసిన గిన్నెలో నూనె వేసి వాము వేయాలి. తరిగిన వెల్లుల్లి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఎండు మిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి. టొమాటొలు, కూరగాయలను వేసి కొంచెంసేపు ఉడికించాలి. తాలింపు పెట్టి తరిగిన పాలకూరను అందులో కలపాలి. స్టవ్ మీద నుంచి గిన్నె దించి నిమ్మరసం కలపాలి. కొత్తిమీర, వేగించిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటుంది. ఇది నలుగురికి సరిపోతుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!









