దక్షిణి సాగ్
- June 07, 2018
కావలసినవి: బీన్స్ 100 గ్రాములు (డైమండ్ ఆకారంలో తరిగి), క్యారెట్ 100 గ్రాములు (డైమండ్ ఆకారంలో తరిగి), కాలీఫ్లవర్ పువ్వులు 100 గ్రాములు, పచ్చి బఠాణీ 50 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 50 గ్రాములు, టొమాటొ 100 గ్రాములు (సన్నగా తరిగి), వెల్లుల్లి 30 గ్రాములు (సన్నగా తరిగి), పాలకూర 800 గ్రాములు, వాము ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి నాలుగు, కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం ఒక టేబుల్ స్పూన్, నూనె 50 గ్రాములు, రెండు కాయల తాజా నిమ్మరసం.
ఎలా చేయాలి: కూరగాయలన్నింటిని కలిపి వేడినీటిలో ముంచి తీసి తరువాత చల్లటి నీటిలో వేసి పక్కన ఉంచుకోవాలి. పాలకూరను వేడినీటిలో ముంచి నీటిని పిండి సన్నగా తరిగి పెట్టుకోవాలి. వేడిచేసిన గిన్నెలో నూనె వేసి వాము వేయాలి. తరిగిన వెల్లుల్లి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఎండు మిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి. టొమాటొలు, కూరగాయలను వేసి కొంచెంసేపు ఉడికించాలి. తాలింపు పెట్టి తరిగిన పాలకూరను అందులో కలపాలి. స్టవ్ మీద నుంచి గిన్నె దించి నిమ్మరసం కలపాలి. కొత్తిమీర, వేగించిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటుంది. ఇది నలుగురికి సరిపోతుంది.
తాజా వార్తలు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!
- తెలంగాణ భవన్ వద్ద కలకలం..
- సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చిన ప్రధాని మోదీ