దక్షిణి సాగ్
- June 07, 2018కావలసినవి: బీన్స్ 100 గ్రాములు (డైమండ్ ఆకారంలో తరిగి), క్యారెట్ 100 గ్రాములు (డైమండ్ ఆకారంలో తరిగి), కాలీఫ్లవర్ పువ్వులు 100 గ్రాములు, పచ్చి బఠాణీ 50 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 50 గ్రాములు, టొమాటొ 100 గ్రాములు (సన్నగా తరిగి), వెల్లుల్లి 30 గ్రాములు (సన్నగా తరిగి), పాలకూర 800 గ్రాములు, వాము ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి నాలుగు, కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం ఒక టేబుల్ స్పూన్, నూనె 50 గ్రాములు, రెండు కాయల తాజా నిమ్మరసం.
ఎలా చేయాలి: కూరగాయలన్నింటిని కలిపి వేడినీటిలో ముంచి తీసి తరువాత చల్లటి నీటిలో వేసి పక్కన ఉంచుకోవాలి. పాలకూరను వేడినీటిలో ముంచి నీటిని పిండి సన్నగా తరిగి పెట్టుకోవాలి. వేడిచేసిన గిన్నెలో నూనె వేసి వాము వేయాలి. తరిగిన వెల్లుల్లి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఎండు మిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి. టొమాటొలు, కూరగాయలను వేసి కొంచెంసేపు ఉడికించాలి. తాలింపు పెట్టి తరిగిన పాలకూరను అందులో కలపాలి. స్టవ్ మీద నుంచి గిన్నె దించి నిమ్మరసం కలపాలి. కొత్తిమీర, వేగించిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటుంది. ఇది నలుగురికి సరిపోతుంది.
తాజా వార్తలు
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు