రాజధానిలో ఎన్కౌంటర్..నలుగురు గ్యాంగ్స్టార్స్ హతం
- June 09, 2018
దేశ రాజధాని ఢిల్లీలో అలజడి.. ఫతేఫూర్ భేరీ ప్రాంతం భారీ కాల్పులతో దద్దరిల్లింది. పోలీసులకు, మాఫియా ముఠా సభ్యులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసు కాల్పుల్లో కరడుగట్టిన గ్యాంగ్స్టర్, రాజేశ్ భారతి, అతని ముగ్గురు అనుచరులు హతమయ్యారు.
మిట్టమధ్యాహ్నం ఢిల్లీ బుల్లెట్ల మోతతో హోరెత్తింది. గ్యాంగ్స్టర్ రాజేష్ భారతి, అతడి అనుచరులను ఢిల్లీ స్పెషల్ టీమ్ మట్టుబెట్టింది. ఛత్తర్పూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్తో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
...
ఢిల్లీ, హరియానా, యూపీ తదితర రాష్ట్రాల్లో రాజేశ్ ముఠా పలు హత్యలు, దోపిడీలు, బలవంతపు వసూళ్లు, అత్యాచారాలకు పాల్పడింది. ఇటీవల అరెస్టయిన ఈ గ్యాంగ్ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని తిరుగుతోంది. 12 కేసుల్లో నిందితుడైన రాజేశ్ తలపై లక్ష రూపాయల రివార్డు ఉంది.
ఇతడి కోసం ఢిల్లీ పోలీసులు చాలాకాలంగా గాలిస్తున్నారు. ఛత్తర్పూర్లోని ఫామ్హౌస్ వస్తారంటూ మూడు నెలలుగా నిఘా పెట్టిన స్పెషల్ టీమ్కు.. శనివారం మధ్యాహ్నం రాజేశ్ అండ్ గ్యాంగ్ తారసపడింది. లొంగిపోవాలంటూ పోలీసులు హెచ్చరించినా.. రాజేశ్ గ్యాంగ్ వినకుండా కాల్పులు మొదలుపెట్టింది. దీంతో.. పోలీసులూ ఎదురుకాల్పులూ మొదలుపెట్టారు... దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఎన్కౌంటర్లో రాజేశ్తో పాటు మరో ముగ్గురు అనుచరులు హతమయ్యారు. ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. రాజేశ్తోపాటు హతమైన వారిని విద్రోహ్, భికూ, ఉమేశ్ డాన్లుగా గుర్తించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







