రంజాన్ సందర్భంగా జనసేన యాత్రకు విరామం: పవన్ కళ్యాణ్
- June 09, 2018రంజాన్ సందర్భంగా జనసేన పోరాట యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు జనసేనాని పవన్ కళ్యాణ్. రంజాన్ తర్వాత తిరిగి యథావిథిగా జనసేన పోరాయ యాత్ర కొనసాగనుందని జనసేన ఓ ప్రకటన ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది ముస్లింలు ఉండటం చేత పవన్ యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. నిన్న యలమంచిలి బహిరంగ సభ ముగించుకొని విశాఖలో ఓ ప్రైవేటు రిసార్ట్స్ లో బస చేసారు జనసేనాని.
ఈరోజు ఉదయం నుండి పవన్ కల్యాణ్ విశాఖకు చెందిన కొందరు మేధావులుతో వరుస సమావేశం అవుతున్నారని ఆ పార్టీ మీడియా హెడ్ హరిప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. పవన్ను కలిసిన వారిలో ఉత్తరాంధ్రలో వెనుకబాటు తనం సమసిపోవడానికి అవిశాత్రంగా పోరాటం చేస్తోన్న కుప్పం యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్, యూనియన్ పబ్లిక్ కమిషన్ లో సేవలు అందించిన ప్రొఫెసర్ కేఎస్ చలం కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపై మూడు రోజులపాటు మేధావులతో చర్చించనున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి వీరితో సమావేశాలు నిర్వహించి సోమవారం సాయంత్రం హైదరాబాదు బయలు దేరనున్న పవన్ కళ్యాణ్.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు