రంజాన్ సందర్భంగా జనసేన యాత్రకు విరామం: పవన్ కళ్యాణ్
- June 09, 2018
రంజాన్ సందర్భంగా జనసేన పోరాట యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు జనసేనాని పవన్ కళ్యాణ్. రంజాన్ తర్వాత తిరిగి యథావిథిగా జనసేన పోరాయ యాత్ర కొనసాగనుందని జనసేన ఓ ప్రకటన ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది ముస్లింలు ఉండటం చేత పవన్ యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. నిన్న యలమంచిలి బహిరంగ సభ ముగించుకొని విశాఖలో ఓ ప్రైవేటు రిసార్ట్స్ లో బస చేసారు జనసేనాని.
ఈరోజు ఉదయం నుండి పవన్ కల్యాణ్ విశాఖకు చెందిన కొందరు మేధావులుతో వరుస సమావేశం అవుతున్నారని ఆ పార్టీ మీడియా హెడ్ హరిప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. పవన్ను కలిసిన వారిలో ఉత్తరాంధ్రలో వెనుకబాటు తనం సమసిపోవడానికి అవిశాత్రంగా పోరాటం చేస్తోన్న కుప్పం యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్, యూనియన్ పబ్లిక్ కమిషన్ లో సేవలు అందించిన ప్రొఫెసర్ కేఎస్ చలం కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపై మూడు రోజులపాటు మేధావులతో చర్చించనున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి వీరితో సమావేశాలు నిర్వహించి సోమవారం సాయంత్రం హైదరాబాదు బయలు దేరనున్న పవన్ కళ్యాణ్.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









