ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన మాజీ ప్రధాని వాజ్పేయి
- June 11, 2018
మాజీ ప్రధాని వాజ్ పేయిని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. రొటీన్ చెకప్, పరీక్షల నిమిత్తం వాజ్పేయిని హాస్పిటల్లో చేర్పించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఎయిమ్స్ డైరెక్టర్, పల్మనాలజిస్ట్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా పర్యవేక్షణలో వాజ్ పేయికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుమారు 3 దశాబ్దాలుగా వాజ్ పేయికి పర్సనల్ ఫిజీషియన్ గా రణ్ దీప్ వ్యవహరిస్తున్నారు. వాజ్పేయి ఆరోగ్య సమస్యలపై డాక్టర్ గులేరియాకు పూర్తి అవగాహన ఉంది. అనారోగ్యంతో వాజ్పేయి 2009 నుంచి ఇంటికే పరిమితమయ్యారు.
రాజకీయ దురంధరుడిగా పేరున్న వాజ్ పేయి 1924లో గ్వాలియర్లో జన్మించారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. లక్నో లోక్ సభ స్థానం నుంచి 1991,1996,1998,1999, 2004 సంవత్సరాల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. బీజేపీ నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయి. 2015లో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం భారతరత్న అందించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







