ఆడాలంటే బుర్ఖా వేసుకోవాలన్నారు.. అందుకే.. - సౌమ్యా స్వామినాథన్
- June 13, 2018భారత చెస్ క్రీడాకారిణి సౌమ్య స్వామినాథన్ ఇరాన్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. జులై 26 నుంచి ఆగస్టు 4 వరకు జరగాల్సి ఉన్న ఆసియన్ నేషన్స్ కప్ చెస్ ఛాంపియన్ షిప్ 2018లో జాతీయ జట్టు తరపున అర్హత సాధించింది. అయితే ఈ టోర్నీలో ఆడాలంటే ఖచ్చితంగా తలవరకు ముసుగు గానీ లేదా బుర్ఖా గానీ విధిగా ధరించాలని అక్కడి ప్రభుత్వం రూలు పెట్టింది. భారత దేశ పౌరురాలిగా, నా వ్యక్తిగత హక్కులను కాలరాసే నిబంధనకు తాను అంగీకరించలేకపోయానని, అందుకే పోటీ నుంచి నిష్క్రమించానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇలా మత సంబంధిత నియమాలు విధించి క్రీడాకారులకు ఆటంకం కలిగించడం సమంజసం కాదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. క్రీడాకారులు ఎన్నో సందర్భాల్లో సర్థుకుపోతూనే ఈవెంట్లలో పాల్గొంటారని వెల్లడించింది. భారతదేశం తరపున జట్టులో సెలక్ట్ అయినందుకు చాలా గౌరవంగా భావించాను, కానీ ఇలాంటి కారణంతో దూరమవ్వాల్సి వస్తున్నందుకు బాధగా ఉంది అని వివరించింది. 2106 లో జరిగిన ఏషియన్ ఎయిర్గన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొనాల్సిన హీనా సిద్దూ కూడా ఇదే కారణంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని గుర్తు చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?