షార్జా:టబ్లో మునిగి బాలిక మృతి
- June 13, 2018
షార్జా:21 నెలల బాలిక, వాటర్ టబ్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన షార్జాలో చోటు చేసుకుంది. బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఘటన గురించిన సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, బాలికను రక్షించేందుకు ప్రయత్నించారు, ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటనపై విచారణ జరిపిన పోలీసులు, ఘటన ఎలా జరిగిందన్నదానిపై ఆరా తీశారు. బాలిక తల్లిదండ్రులు, తమ బంధువుల ఇంటికి వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కా చెల్లెళ్ళు బాత్ టబ్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆసుపత్రికి తరలించే సమయానికే బాలిక మృతి చెందింది. నీటిని అధికంగా తాగేయడం వల్ల ఊపిరి ఆడక బాలిక మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







