యూఏఈ వీసా ఆన్ అరైవల్: ఇండియన్స్కి అర్హత ఎలాగంటే..
- June 13, 2018దుబాయ్ రెసిడెన్సీ అథారిటీ, యూఏఈ వీసా ఆన్ అరైవల్ పొందేందుకు ఇండియన్స్ ఏం చేయాలో వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఈద్ అల్ ఫితర్ దగ్గరవుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో యూఏఈ రావాలనుకునే భారతీయులకు యూఏఈ వీసా ఆన్ అరైవల్కి సంబంధించి రిమైండర్ని జారీ చేసింది. యునైటెడ్ కింగ్డమ్ లేదా యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన రెసిడెన్సీ వీసా వున్నవారికి, అమెరికన్ వీసా లేదా గ్రీన్ కార్డ్ వున్నవారికి ఈ వీసా ఆన్ అరైవల్ వర్తిస్తుంది. అయితే రెసిడెన్సీ వీసాలు 6 నెలలకు పైబడి చెల్లుబాటయ్యేలా వుడాలి. ఎంట్రీ పర్మిషన్ కోసం 100 దిర్హామ్ల రుసుముని, అలాగే 20 దిర్హామ్లు సర్వీసు ఫీ ఛార్జ్గానూ చెల్లించాల్సి వుంటుంది. ఇలా వీసా ఆన్ అరైవల్ పొందేవారికి అత్యధికంగా 14 రోజులపాటు యూఏఈలో స్టే చేసే అవకాశం వుంది. దీన్ని మరోసారి పొడిగించుకునేందుకూ అవకాశం వుంది. దీనికోసం 250 దిర్హామ్ల రెన్యువల్ ఫీజు, 20 దిర్హామ్ల సర్వీసు ఫీజు చెల్లించాలి. ఎక్స్టెన్షన్ పొందేవారికి 28 రోజులు స్టే చేసే అవకాశం లభిస్తుంది. ఓవర్ స్టేయింగ్కి (ఒక రోజుకి) 100 దిర్హామ్ల జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..