యూఏఈ వీసా ఆన్ అరైవల్: ఇండియన్స్కి అర్హత ఎలాగంటే..
- June 13, 2018
దుబాయ్ రెసిడెన్సీ అథారిటీ, యూఏఈ వీసా ఆన్ అరైవల్ పొందేందుకు ఇండియన్స్ ఏం చేయాలో వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఈద్ అల్ ఫితర్ దగ్గరవుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో యూఏఈ రావాలనుకునే భారతీయులకు యూఏఈ వీసా ఆన్ అరైవల్కి సంబంధించి రిమైండర్ని జారీ చేసింది. యునైటెడ్ కింగ్డమ్ లేదా యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన రెసిడెన్సీ వీసా వున్నవారికి, అమెరికన్ వీసా లేదా గ్రీన్ కార్డ్ వున్నవారికి ఈ వీసా ఆన్ అరైవల్ వర్తిస్తుంది. అయితే రెసిడెన్సీ వీసాలు 6 నెలలకు పైబడి చెల్లుబాటయ్యేలా వుడాలి. ఎంట్రీ పర్మిషన్ కోసం 100 దిర్హామ్ల రుసుముని, అలాగే 20 దిర్హామ్లు సర్వీసు ఫీ ఛార్జ్గానూ చెల్లించాల్సి వుంటుంది. ఇలా వీసా ఆన్ అరైవల్ పొందేవారికి అత్యధికంగా 14 రోజులపాటు యూఏఈలో స్టే చేసే అవకాశం వుంది. దీన్ని మరోసారి పొడిగించుకునేందుకూ అవకాశం వుంది. దీనికోసం 250 దిర్హామ్ల రెన్యువల్ ఫీజు, 20 దిర్హామ్ల సర్వీసు ఫీజు చెల్లించాలి. ఎక్స్టెన్షన్ పొందేవారికి 28 రోజులు స్టే చేసే అవకాశం లభిస్తుంది. ఓవర్ స్టేయింగ్కి (ఒక రోజుకి) 100 దిర్హామ్ల జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







