ఇ-సర్వీసుల్లో అంతరాయం
- June 15, 2018
బహ్రెయిన్ కింగ్డమ్లో సాంకేతిక సమస్యల కారణంగా ఇ-గవర్నమెంట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. గత మూడు రోజులుగా సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బహ్రెయినీ పౌరుడు అబ్దుల్ అజీజ్ అహ్మద్ చెప్పారు. కొన్ని సర్వీసులు అసలు యాక్సెస్ కావడంలేదనీ, మరికొన్ని లాగిన్ తర్వాత సమస్యలకు గురవుతున్నాయని ఆయన చెప్పారు. యాహ్యా అనే మరో సిటిజన్ మాట్లాడుతూ, మాన్యువల్గా చేసుకుంటే తక్కువ సమయంలోనే పని పూర్తయ్యేదనీ, ఆన్లైన్ ద్వారా చేయాల్సి రావడంతో సమస్య తీవ్రంగా మారిందని అన్నారు. ఎలక్ట్రానిక్ ఛానెల్స్ని అప్డేట్ చేస్తున్నామనీ, ఈ క్రమంలో తలెత్తిన సాంకేతిక సమస్యలకు చింతిస్తున్నామని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అతి త్వరలోనే ఈ సర్వీసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందిస్తాయని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







