ఇ-సర్వీసుల్లో అంతరాయం
- June 15, 2018
బహ్రెయిన్ కింగ్డమ్లో సాంకేతిక సమస్యల కారణంగా ఇ-గవర్నమెంట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. గత మూడు రోజులుగా సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బహ్రెయినీ పౌరుడు అబ్దుల్ అజీజ్ అహ్మద్ చెప్పారు. కొన్ని సర్వీసులు అసలు యాక్సెస్ కావడంలేదనీ, మరికొన్ని లాగిన్ తర్వాత సమస్యలకు గురవుతున్నాయని ఆయన చెప్పారు. యాహ్యా అనే మరో సిటిజన్ మాట్లాడుతూ, మాన్యువల్గా చేసుకుంటే తక్కువ సమయంలోనే పని పూర్తయ్యేదనీ, ఆన్లైన్ ద్వారా చేయాల్సి రావడంతో సమస్య తీవ్రంగా మారిందని అన్నారు. ఎలక్ట్రానిక్ ఛానెల్స్ని అప్డేట్ చేస్తున్నామనీ, ఈ క్రమంలో తలెత్తిన సాంకేతిక సమస్యలకు చింతిస్తున్నామని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అతి త్వరలోనే ఈ సర్వీసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందిస్తాయని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







