హైదరాబాద్-కరీంనగర్ ప్యాసింజర్ రైలును ప్రారంభించిన పీయూష్ గోయల్
- June 15, 2018హైదరాబాద్-కరీంనగర్.. ప్యాసింజర్ రైలు ప్రారంభం సికింద్రాబాద్: కాచిగూడ, కరీంనగర్ల మధ్య నడిచే కేసీజీ రైలు(57601)ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైలును లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండారు దత్తాత్రేయ, కవిత, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రైలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు కాచిగూడలో బయల్దేరి నిజామాబాద్, మోర్తాడ్, మెట్పల్లి, కోరుట్ల, మేడిపల్లి, లింగంపేట, జగిత్యాల, నూకపల్లి మల్యాల, పొద్దూరు, గంగాధర, కొత్తపల్లి మీదుగా కరీంనగర్కు మధ్యాహ్నం 3-25 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అక్కణ్నుంచి మధ్యాహ్నం 3-45 గంటలకు బయల్దేరి.. కాచిగూడకు రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ