హైదరాబాద్-కరీంనగర్ ప్యాసింజర్ రైలును ప్రారంభించిన పీయూష్ గోయల్
- June 15, 2018
హైదరాబాద్-కరీంనగర్.. ప్యాసింజర్ రైలు ప్రారంభం సికింద్రాబాద్: కాచిగూడ, కరీంనగర్ల మధ్య నడిచే కేసీజీ రైలు(57601)ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైలును లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండారు దత్తాత్రేయ, కవిత, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రైలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు కాచిగూడలో బయల్దేరి నిజామాబాద్, మోర్తాడ్, మెట్పల్లి, కోరుట్ల, మేడిపల్లి, లింగంపేట, జగిత్యాల, నూకపల్లి మల్యాల, పొద్దూరు, గంగాధర, కొత్తపల్లి మీదుగా కరీంనగర్కు మధ్యాహ్నం 3-25 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అక్కణ్నుంచి మధ్యాహ్నం 3-45 గంటలకు బయల్దేరి.. కాచిగూడకు రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది.
తాజా వార్తలు
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!
- ఖతార్ లో 17 ట్రావెల్, ఎయిర్ కార్గొ ఏజెన్సీలు సీజ్..!!







