ఈ నెల 24న చికాగో సెక్స్ రాకెట్ పై 'మా' మీటింగ్
- June 16, 2018
యుఎస్ లో టాలీవుడ్ హీరోయిన్స్ సెక్స్ రాకెట్'తో 'మా' అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది. చికాగో సెక్స్ రాకెట్ లో నిర్మాత కిషన్ మోదుగుముడి దంపతులని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రాకెట్ లో టాలీవుడ్ కు చెందిన టాప్ హీరోయిన్స్ ఉన్నట్టు చెబుతున్నారు. ఆ పేర్లు బయటికొస్తే టాలీవుడ్ షేక్ అవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని పేర్లు లీకయ్యాయని తెలుస్తోంది.
ఈ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ మా అసోసియేషన్ జూన్ 24 సమావేశం కానున్నట్లు ప్రకటించింది. ఈ సమావేశంలో ఏం చర్చించబోతున్నారు. ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఈ వ్యవహారంపై నటి శ్రీరెడ్డి, యాంకర్ అనసూయలు స్పందించారు. గతంలో అమెరికా దంపతులు తమని కూడా సంప్రదించారని తెలిపారు.
కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన కిషన్ మోదుగుముడి అలియాస్ రాజు అలియాస్ శ్రీరాజు, అతని భార్య చంద్రలు టాలీవుడ్కు చెందిన నటీమణులను తాత్కాలిక వీసా మీద అమెరికాకు తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు అభియోగాలు నమోదుచేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







