డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన..

- December 10, 2015 , by Maagulf
డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన..

నగరంలో బేగంపేటలోని రసూల్‌పురలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం శంకుస్థాపన చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ పనులకు తెలంగాణ మంత్రులు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మొహమద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వీటితో పాటు సూరారం చెరువు, గుర్రంచెరువు అభివృద్ధి పనులకు, రక్షాపురంలో మోడల్ మార్కెట్ కు శంకుస్థాపన చేయనున్నారు. కాగా ఈ నెల 15 తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో ముందుగానే అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపనలు చేపట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com