తీవ్రవాదానికి మతంతో సంబంధం లేదు
- December 10, 2015
ప్రపంచంలోని అన్ని దేశాలూ తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు తమవంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్. రియాద్లో జరుగుతున్న 36వ గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్తో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిసిసి సభ్య దేశాలతో తాము ఎప్పుడూ సన్నిహిత సంబంధాలనే కోరుకుంటామని చెప్పారాయన. 1981లో జిసిసి ఏర్పాటయ్యింది. ఇందులో బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి. జిసిసి సభ్యదేశాలన్నీ తమకు ఉమ్మడి శతృవులుగా పరిణమిస్తున్న తీవ్రవాదం తదితర అంశాలను భావించాల్సి ఉంటుందని, అభివృద్ధిలో అందరం కలిసి ముందడుగు వేయాలని కింగ్ సల్మాన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. సంక్షోభంలో ఉన్న యెమన్ని ఆదుకోవడం జిసిసి దేశాలు బాద్యతగా తీసుకున్నాయని ఆయన చెప్పారు. సిరియాలో తీవ్రవాదం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, అక్కడి ప్రభుత్వానికి అండగా ఉండాలని కింగ్ సల్మాన్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







