దుబాయ్ కు రద్దు కానున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్
- December 10, 2015
జనవరి మాసాంతం లో వాషింగ్టన్ మరియు దుబాయ్ ల మధ్య తమ విమాన సేవలను రద్దు చేయనున్నట్లు యునైటెడ్ ఎయిర్ లైన్స్ ఒక ప్రకటన లో తెలిపింది. అమెరికా కు చెందిన ప్రయాణికులతో కూడిన ఏ ఒక్క విమానం గల్ఫ్ దేశాలకు ప్రయాణించదని వారు ఈ సందర్బంగా వివరించారు. ఈ నిభందనలకు కారణం అమెరికా ప్రభుత్వం 2016 నుంచి వాషింగ్టన్ దుబాయ్ మధ్య ఉన్న ప్రయాణం ఇకపై జెట్ బ్లూ ఎయిర్ వేస్ కార్పొరేషన్ కు అప్పగించేలా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ఇంటర్నెట్ లో సమాచారం ఉంది. డెల్టా ఎయిర్ లైన్స్ , అమెరికా ఎయిర్ లైన్స్ గ్రూప్ సంస్థలు ఈ సందర్భంగా ఆరోపిస్తూ యునైటెడ్ ఎమిరేట్స్ , మరో రెండు మధ్య ప్రాస్త్య దేశాలు విమాన సంస్థలు వారి వారి ప్రభుత్వాల నుంచి రాయతీలు పొందాయన్నారు. దీని ప్రకారం వారు పలు విమానాలను కొనుగోలు చేయాలని, అలాగే టికెట్ ధరలను తగ్గించాల్సి ఉందన్నారు. అయతె అమెరికా ఎయిర్ లైన్స్ సంస్థ తీసుకొన్న ఈ చర్యపై గల్ఫ్ ఎయిర్ లైన్స్ స్పందిస్తూ, ఈ నిర్ణయం సరి కాదన్నారు.
ఈ ఆరోపణపై తమ నిరసన ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది ఎమిరేట్స్ విమానాలలో లో 15
వేల మంది అమెరికాకు చెందిన ఉద్యోగులు ప్రయణిస్తున్నత్లు తెలిపారు. ఆ ఆరోపణపై యునైటెడ్ ఎయిర్
లైన్స్ ప్రతిఘటించినప్పటికీ ఆ చర్య విజయవంతం కాలేదు.
డెల్టా ఎయిర్ లైన్స్, 2016 ఫిబ్రవరి లో అట్లాంటా మరియు దుబాయ్ మధ్య అన్ని విమాన
సేవలను నిలుపుదల చేయనున్నారు. దీనికి కారణం ఆ మార్గం లో ఎమిరేట్స్ , ఇతిహాద్ , మరియు
ఖతర్ విమాన సర్వీస్ లో విస్తరణ కారణంగా ఆ ప్రయాణ మార్గంలో అపరమితమైన రద్ది ఏర్పడింది.
అమెరికాలోని 12 నగరాలలో వారానికి 200 విమాన సేవలను ఎమిరేట్స్, ఇతిహాద్ , మరియు ఖతర్
అందిస్తున్నారు. యునైటెడ్ ఎయిర్ లైన్స్ తెలియచేస్తూ, ఇకపై తమ వినియోగదారులు డచ్ లుఫ్తాన్సా,
ఏజి మరియు ఎయిర్ కెనడా ద్వారా తమ ప్రయాణాలకు టికెట్ ను పొందవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







