ఫేక్ బిజినెస్ అడ్వర్టయిజ్మెంట్: వ్యక్తికి జైలు, జరీమానా
- June 21, 2018
మస్కట్:ఫేక్ బిజినెస్ అడ్వర్టయిజ్మెంట్ అభియోగాల నేపథ్యంలో ఓ వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, 550 ఒమన్ రియాల్స్ జరీమానా విధించడం జరిగింది. కన్స్యూమర్ వాచ్ డాగ్ ఈ విషయాన్ని వెల్లడించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు, ఓ వెబ్సైట్లో ఫేక్ అడ్వర్టయిజ్మెంట్ని పొందుపరిచాడు. ఈ అడ్వర్టయిజ్మెంట్లో, ఫిలిప్పినో డొమెస్టిక్ వర్కర్స్కి సహాయం చేస్తానని పేర్కొనడం జరిగింది. ఈ ప్రకటన చూసి 1,200 ఒమన్ రియాల్స్ చెల్లించిన ఓ వ్యక్తి, ఎంతకాలమైనా తనకు కోరుకున్న ఉద్యోగం రాకపోవడంతో కన్స్యుమర్ ప్రొటెక్షన్ అడ్మినిస్ట్రేషన్ (బురైమీ)ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసి, నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించగా, న్యాయస్థానం నిందితుడికి జైలు శిక్ష, జరీమానాతోపాటుగా, బాధితుడికి 1,350 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







