ఫేక్ బిజినెస్ అడ్వర్టయిజ్మెంట్: వ్యక్తికి జైలు, జరీమానా
- June 21, 2018
మస్కట్:ఫేక్ బిజినెస్ అడ్వర్టయిజ్మెంట్ అభియోగాల నేపథ్యంలో ఓ వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, 550 ఒమన్ రియాల్స్ జరీమానా విధించడం జరిగింది. కన్స్యూమర్ వాచ్ డాగ్ ఈ విషయాన్ని వెల్లడించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు, ఓ వెబ్సైట్లో ఫేక్ అడ్వర్టయిజ్మెంట్ని పొందుపరిచాడు. ఈ అడ్వర్టయిజ్మెంట్లో, ఫిలిప్పినో డొమెస్టిక్ వర్కర్స్కి సహాయం చేస్తానని పేర్కొనడం జరిగింది. ఈ ప్రకటన చూసి 1,200 ఒమన్ రియాల్స్ చెల్లించిన ఓ వ్యక్తి, ఎంతకాలమైనా తనకు కోరుకున్న ఉద్యోగం రాకపోవడంతో కన్స్యుమర్ ప్రొటెక్షన్ అడ్మినిస్ట్రేషన్ (బురైమీ)ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసి, నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించగా, న్యాయస్థానం నిందితుడికి జైలు శిక్ష, జరీమానాతోపాటుగా, బాధితుడికి 1,350 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
తాజా వార్తలు
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!







