ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే...
- June 22, 2018
భారతీయ సంతతి చేందిన మహిళకు ఆమె ప్రియిడుకి మెల్బోర్న్లోని ఆస్ట్రేలియన్ కోర్టు 20 సంవత్సరాలకు పైగా జైల్ శిక్ష విధించింది.2015లో సోఫియా అనే మహిళ ఆమె భర్తను ప్రియిడుతో కలిసి జ్యూస్లో విషం కలిపి హతమార్చారు.రెండేళ్లుగా ఈ కేసును విచారించిన కోర్టుసోఫియా(34)కు 22 సంవత్సరాలు ఆమె ప్రియిడు అరుణ్ కమలసనాన్(36)కు 27 ఏళ్ళపాటు శిక్షను విధించింది. జస్టిస్ పాల్ కోగ్లన్ తీర్పుని ఇస్తూ "ఇది చాలా తీవ్రమైన హత్య నేరం"అని తన జడ్జ్మెంట్లో పేర్కొన్నారు.
అరుణ్తో సోఫియా పరిచయం:
కేరళకు చెందిన అరుణ్ కమలాసనన్, సోఫియా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు.వీరి స్నేహం చివరకు ప్రేమగా మారింది. కానీ ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. సోఫియాకు సామ్ అబ్రహంతో కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. సామ్ అబ్రహం భార్యతో కలిసి అస్ట్రేలియాలో స్దిరపడ్డారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అరుణ్కు కూడా మరో అమ్మాయితో పెళ్లైంది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లైన తర్వాత కూడా సోఫియా, అరుణ్లు చాటు ప్రేమ వ్యవహరం జరిపారు.అరుణ్ భార్యా పిల్లల్ని వదిలి పెట్టి 2013లో ఆస్ట్రేలియా చేరుకున్నాడు. అప్పటి నుంచి వారిద్దరూ రహస్యంగా కలుసుకునేవారు. ఈ క్రమంలో సామ్ అడ్డు తొలగించుకోని జీవితాంతం తామిద్దరం కలిసి ఉండొచ్చని భావించిన అరుణ్.. సోఫియాతో సామ్ను హత్య చేసేందుకు పథకం వేశాడు
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..