ఇంటర్నేషనల్‌ యోగా డే లో పాల్గొన్న 500 మంది

- June 24, 2018 , by Maagulf
ఇంటర్నేషనల్‌ యోగా డే లో పాల్గొన్న 500 మంది

మస్కట్‌: ఇండియన్‌ ఎంబసీ, మస్కట్‌లో నిర్వహించిన గ్రాండ్‌ యోగా సెషన్‌లో 5000 మందికి పైగా ఔత్సాహికులు పల్గొన్నారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఈ ఈవెంట్‌ని నిర్వహఙంచారు. ఈ యోగా వేడుకలో ఇండియన్స్‌, ఇతర వలసదారులు, డిప్లమాటిక్‌ కార్ప్స్‌, స్టూడెంట్స్‌, పౌరులు పాల్గొన్నారు. ఒమన్‌ కన్వెన్షన్‌ మరియు ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఈ ఈవెంట్‌ జరిగింది. 80 ఏళ్ళ వయసు దాటినవారూ, చిన్న పిల్లలు సైతం ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం గమనార్హం. ఒమన్‌ ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌ ఒమన్‌, అలాగే ఆ సంస్థకు చెందిన 27 లింగ్విస్టిక్‌ వింగ్స్‌, ఇండియన్‌ స్కూల్స్‌ మస్కట్‌, 16 యోగా ఆర్గనైజేషన్స్‌ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఈ సందర్భంగా యోగా మ్యాట్స్‌, టీ షర్ట్‌లను ఇండియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కొన్ని అందించాయి. 2015 నుంచి ఇండియన్‌ ఎంబసీ ఈ ఇంటర్నేషనల్‌ యోగా డే వేడుకల్ని నిర్వహిస్తూ వస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com