ఇంటర్నేషనల్ యోగా డే లో పాల్గొన్న 500 మంది
- June 24, 2018
మస్కట్: ఇండియన్ ఎంబసీ, మస్కట్లో నిర్వహించిన గ్రాండ్ యోగా సెషన్లో 5000 మందికి పైగా ఔత్సాహికులు పల్గొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఈ ఈవెంట్ని నిర్వహఙంచారు. ఈ యోగా వేడుకలో ఇండియన్స్, ఇతర వలసదారులు, డిప్లమాటిక్ కార్ప్స్, స్టూడెంట్స్, పౌరులు పాల్గొన్నారు. ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ ఈవెంట్ జరిగింది. 80 ఏళ్ళ వయసు దాటినవారూ, చిన్న పిల్లలు సైతం ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం గమనార్హం. ఒమన్ ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియన్ సోషల్ క్లబ్ ఒమన్, అలాగే ఆ సంస్థకు చెందిన 27 లింగ్విస్టిక్ వింగ్స్, ఇండియన్ స్కూల్స్ మస్కట్, 16 యోగా ఆర్గనైజేషన్స్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఈ సందర్భంగా యోగా మ్యాట్స్, టీ షర్ట్లను ఇండియన్ ఎంటర్ప్రైజెస్ కొన్ని అందించాయి. 2015 నుంచి ఇండియన్ ఎంబసీ ఈ ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్ని నిర్వహిస్తూ వస్తోంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









