మస్కట్: బావిలో పడ్డ వలస కార్మికుడికి తీవ్రగాయాలు
- June 26, 2018
మస్కట్: ఓ వలస కార్మికుడు బావిలో పడి తీవ్రగాయాల పాలైన ఘటన అల్ దఖ్లియా గవర్నరేట్ పరిధిలో జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం అల్ దఖ్లియా గవర్నరేట్ పరిధిలోని విలాయత్ ఆఫ్ మనాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందగానే, పిఎసిడిఎ వాటర్ రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆసియా జాతీయుడైన వలస కార్మికుడ్ని బావి నుంచి వెలుపలికి తీశారు. గాయపడ్డ అతన్ని ఆసుపత్రికి తరలించారు. గాయాల తీవ్రత ఎక్కువగా వుండడంతో బాధితుడి పరిస్థితి విషమంగా మారింది.
తాజా వార్తలు
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!
- సినావ్లో అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు..!!









