కోలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన 'మిస్ ఇండియా'
- June 26, 2018
అందాల పోటీలు, మోడలింగ్ రంగాలు వెండితెరకు మధ్య వారధిగా మారుతున్నాయి. అందాలపోటీల్లో కిరీటాలను గెలుచుకుని, మోడలింగ్ రంగంలో రాణిస్తూ సినీ కథానాయకీలుగా ప్రమోట్ అవుతున్నారు కొందరు నటీమణులు. ఇటీవల ఆ జాబితాలో చేరారు బెంగాలీ బ్యూటీ ఉపాసన. 2015లో ఆల్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు ఉపాసన. దాదాపు 100 వాణిజ్య ప్రకటనల్లో నటించిన ఆమె. విజయ్ టీవీలో ప్రసారం అయిన 'విల్లా టూ విలేజ్' కార్యక్రమంతో మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తరువాత సినిమా రంగం వైపు మళ్ళీ ఈ మధ్యనే '88' చిత్రం ద్వారా కోలీవుడ్కు హీరోయిన్ గా రంగప్రవేశం చేసింది. కానీ '88' అంతకన్నా ముందే ఉపాసన 'ట్రాఫిక్ రామస్వామి' లో నటించింది. ఎపుడైనా.. ఎక్కడైనా.. తనకు ఇష్టమైన సినిమా గురించి చెప్పమంటే 'ట్రాఫిక్ రామస్వామి' అనే చెబుతుందట. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ మోడలింగ్ వృత్తిని మాత్రం వదులుకోను అని చెబుతున్నారు.అవకాశమొస్తే బాలీవుడ్ లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







