కోలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన 'మిస్ ఇండియా'
- June 26, 2018
అందాల పోటీలు, మోడలింగ్ రంగాలు వెండితెరకు మధ్య వారధిగా మారుతున్నాయి. అందాలపోటీల్లో కిరీటాలను గెలుచుకుని, మోడలింగ్ రంగంలో రాణిస్తూ సినీ కథానాయకీలుగా ప్రమోట్ అవుతున్నారు కొందరు నటీమణులు. ఇటీవల ఆ జాబితాలో చేరారు బెంగాలీ బ్యూటీ ఉపాసన. 2015లో ఆల్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు ఉపాసన. దాదాపు 100 వాణిజ్య ప్రకటనల్లో నటించిన ఆమె. విజయ్ టీవీలో ప్రసారం అయిన 'విల్లా టూ విలేజ్' కార్యక్రమంతో మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తరువాత సినిమా రంగం వైపు మళ్ళీ ఈ మధ్యనే '88' చిత్రం ద్వారా కోలీవుడ్కు హీరోయిన్ గా రంగప్రవేశం చేసింది. కానీ '88' అంతకన్నా ముందే ఉపాసన 'ట్రాఫిక్ రామస్వామి' లో నటించింది. ఎపుడైనా.. ఎక్కడైనా.. తనకు ఇష్టమైన సినిమా గురించి చెప్పమంటే 'ట్రాఫిక్ రామస్వామి' అనే చెబుతుందట. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ మోడలింగ్ వృత్తిని మాత్రం వదులుకోను అని చెబుతున్నారు.అవకాశమొస్తే బాలీవుడ్ లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!