ఎన్డీఆర్ బయోపిక్ పై మరో వివాదం... నాదెండ్ల భాస్కర్ రావు కుటుంబం..
- June 28, 2018
ఎన్డీఆర్ బయోపిక్ పై మరో వివాదం ముసురుకుంది. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కుటుంబం సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు సినిమా దర్శకుడు క్రిష్, నటుడు బాలకృష్ణకు నోటీసులు పంపింది. ఎమ్మెల్యే హోదాను ఉద్దేశించి ఒకటి, నటుడిగా మరొక నోటీసును బాలకృష్ణకు నాదెండ్ల భాస్కరరావు పెద్ద కుమారుడు పంపారు. సినిమాలో తమ పాత్రల గురించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించే సమయంలో నాదేండ్ల ఎన్డీఆర్ స్నేహితులు. కానీ, అప్పటి పరిస్థితుల ప్రభావంతో ఇద్దరి మధ్య స్నేహం చెడింది. నాదెండ్ల ఎన్టీఆర్ కు షాకిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్ బయో పిక్ లో ఈ సన్నివేశాలు కూడా ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, నాదెండ్లను నెగటీవ్ గా చూపించబోతున్నారన్నది భాస్కర్రావు పెద్ద కుమారిడి ప్రధాన అభ్యంతరం.
నందమూరి తారక రామరావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరో బాలకృష్ణ ఎన్డీఆర్ రోల్ పోషిస్తున్నారు. మార్చి 29న సినిమా ఓపెనింగ్ అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. రామకృష్ణ స్టూడియోస్ జరిగిన తొలి సన్నివేశానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు క్లాప్ కొట్టారు. మొదట్లో సినిమా దర్శకుడిగా తేజకు అవకాశం దక్కినా..ఆ కొద్ది రోజులకే తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తాను ఎన్టీఆర్ సినిమా తీయలేనంటూ సైడైపోయాడు. ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలను క్రిష్ కు అప్పగించారు. సినిమా రిలీజ్కు కూడా స్పెషల్ డేట్ను ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9నే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావాల్సివుంది.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించే సమయంలో నాదేండ్ల ఎన్డీఆర్ స్నేహితులు. కానీ, అప్పటి పరిస్థితుల ప్రభావంతో ఇద్దరి మధ్య స్నేహం చెడింది. నాదెండ్ల ఎన్టీఆర్ కు షాకిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్ బయో పిక్ లో ఈ సన్నివేశాలు కూడా ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, నాదెండ్లను నెగటీవ్ గా చూపించబోతున్నారన్నది భాస్కర్రావు పెద్ద కుమారిడి ప్రధాన అభ్యంతరం.
నందమూరి తారక రామరావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరో బాలకృష్ణ ఎన్డీఆర్ రోల్ పోషిస్తున్నారు. మార్చి 29న సినిమా ఓపెనింగ్ అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. రామకృష్ణ స్టూడియోస్ జరిగిన తొలి సన్నివేశానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు క్లాప్ కొట్టారు. మొదట్లో సినిమా దర్శకుడిగా తేజకు అవకాశం దక్కినా..ఆ కొద్ది రోజులకే తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తాను ఎన్టీఆర్ సినిమా తీయలేనంటూ సైడైపోయాడు. ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలను క్రిష్ కు అప్పగించారు. సినిమా రిలీజ్కు కూడా స్పెషల్ డేట్ను ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9నే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావాల్సివుంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







