దిల్లీలో దారుణం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య
- July 01, 2018
దిల్లీలో దారుణం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. ఉత్తర దిల్లీలోని బురారీ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఓ ఇంట్లో 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాల కళ్లకు గంతలు, కాళ్లు చేతులు కట్టేసి ఉన్నట్లు చెబుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం..వారు ఫర్నీచర్ వ్యాపారం చేసేవారట. రోజూ ఉదయం 6 గంటలకు షాప్ తెరిచేవారు, ఈరోజు 7.30 అయినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లిచూశామని 11 మంది ఉరేసుకున్నట్లు కన్పించడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా? లేదా పాత కక్షలతో ఎవరైనా చంపి ఉరి తీశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఒకేసారి 11 మంది మృతదేహాలు లభ్యమయ్యేటప్పటికి చుట్టు పక్కలవారు భయబ్రాంతులకు గురవుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







