దిల్లీలో దారుణం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య
- July 01, 2018
దిల్లీలో దారుణం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. ఉత్తర దిల్లీలోని బురారీ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఓ ఇంట్లో 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాల కళ్లకు గంతలు, కాళ్లు చేతులు కట్టేసి ఉన్నట్లు చెబుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం..వారు ఫర్నీచర్ వ్యాపారం చేసేవారట. రోజూ ఉదయం 6 గంటలకు షాప్ తెరిచేవారు, ఈరోజు 7.30 అయినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లిచూశామని 11 మంది ఉరేసుకున్నట్లు కన్పించడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా? లేదా పాత కక్షలతో ఎవరైనా చంపి ఉరి తీశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఒకేసారి 11 మంది మృతదేహాలు లభ్యమయ్యేటప్పటికి చుట్టు పక్కలవారు భయబ్రాంతులకు గురవుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







