సోషల్మీడియా వాడాలంటే ఇకపై అంత చెల్లించాల్సిందే..
- July 02, 2018
ఉగాండాలో జులై 1 నుంచి ఈ పన్ను విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. యూజర్లు సోషల్మీడియా యాప్లను వినియోగించుకోవాలంటే రోజుకు 200షిల్లింగ్లు అంటే మన కరెన్సీలో దాదాపు 3 రూపాయల50 పైసలు పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్ మనీ ద్వారా ఈ డబ్బు చెల్లించిన తర్వాతే సోషల్మీడియా యాప్లకు యాక్సెసింగ్ వస్తుంది. సోషల్ మీడియా వినియోగంపై పన్నును ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో టెలికాం సంస్థలు జులై 1 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి.
సోషల్మీడియా వినియోగంపై పన్నును విధించాలని ఉగాండా అధ్యక్షుడు ముసెవెనీ ఈ ఏడాది మార్చిలో నిర్ణయించారు. ఈ మేరకు రోజుకు 200 షిల్లింగ్ల చొప్పును పన్ను విధించాలని ఆర్థికశాఖ, రెవెన్యూ శాఖలను ఆదేశిస్తూ అప్పట్లో లేఖ కూడా రాశారు. అయితే విద్యాపరమైన అవసరాల కోసం సోషల్మీడియాను ఉపయోగించుకునే వారికి మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు కల్పించాలని సూచించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఉగాండా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రభుత్వం ఆదాయంగా మలుచుకొంటోందని విమర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







