సోషల్మీడియా వాడాలంటే ఇకపై అంత చెల్లించాల్సిందే..
- July 02, 2018
ఉగాండాలో జులై 1 నుంచి ఈ పన్ను విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. యూజర్లు సోషల్మీడియా యాప్లను వినియోగించుకోవాలంటే రోజుకు 200షిల్లింగ్లు అంటే మన కరెన్సీలో దాదాపు 3 రూపాయల50 పైసలు పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్ మనీ ద్వారా ఈ డబ్బు చెల్లించిన తర్వాతే సోషల్మీడియా యాప్లకు యాక్సెసింగ్ వస్తుంది. సోషల్ మీడియా వినియోగంపై పన్నును ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో టెలికాం సంస్థలు జులై 1 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి.
సోషల్మీడియా వినియోగంపై పన్నును విధించాలని ఉగాండా అధ్యక్షుడు ముసెవెనీ ఈ ఏడాది మార్చిలో నిర్ణయించారు. ఈ మేరకు రోజుకు 200 షిల్లింగ్ల చొప్పును పన్ను విధించాలని ఆర్థికశాఖ, రెవెన్యూ శాఖలను ఆదేశిస్తూ అప్పట్లో లేఖ కూడా రాశారు. అయితే విద్యాపరమైన అవసరాల కోసం సోషల్మీడియాను ఉపయోగించుకునే వారికి మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు కల్పించాలని సూచించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఉగాండా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రభుత్వం ఆదాయంగా మలుచుకొంటోందని విమర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..