సోషల్మీడియా వాడాలంటే ఇకపై అంత చెల్లించాల్సిందే..
- July 02, 2018
ఉగాండాలో జులై 1 నుంచి ఈ పన్ను విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. యూజర్లు సోషల్మీడియా యాప్లను వినియోగించుకోవాలంటే రోజుకు 200షిల్లింగ్లు అంటే మన కరెన్సీలో దాదాపు 3 రూపాయల50 పైసలు పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్ మనీ ద్వారా ఈ డబ్బు చెల్లించిన తర్వాతే సోషల్మీడియా యాప్లకు యాక్సెసింగ్ వస్తుంది. సోషల్ మీడియా వినియోగంపై పన్నును ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో టెలికాం సంస్థలు జులై 1 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి.
సోషల్మీడియా వినియోగంపై పన్నును విధించాలని ఉగాండా అధ్యక్షుడు ముసెవెనీ ఈ ఏడాది మార్చిలో నిర్ణయించారు. ఈ మేరకు రోజుకు 200 షిల్లింగ్ల చొప్పును పన్ను విధించాలని ఆర్థికశాఖ, రెవెన్యూ శాఖలను ఆదేశిస్తూ అప్పట్లో లేఖ కూడా రాశారు. అయితే విద్యాపరమైన అవసరాల కోసం సోషల్మీడియాను ఉపయోగించుకునే వారికి మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు కల్పించాలని సూచించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఉగాండా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రభుత్వం ఆదాయంగా మలుచుకొంటోందని విమర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







