సోషల్మీడియా వాడాలంటే ఇకపై అంత చెల్లించాల్సిందే..
- July 02, 2018
ఉగాండాలో జులై 1 నుంచి ఈ పన్ను విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. యూజర్లు సోషల్మీడియా యాప్లను వినియోగించుకోవాలంటే రోజుకు 200షిల్లింగ్లు అంటే మన కరెన్సీలో దాదాపు 3 రూపాయల50 పైసలు పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్ మనీ ద్వారా ఈ డబ్బు చెల్లించిన తర్వాతే సోషల్మీడియా యాప్లకు యాక్సెసింగ్ వస్తుంది. సోషల్ మీడియా వినియోగంపై పన్నును ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో టెలికాం సంస్థలు జులై 1 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి.
సోషల్మీడియా వినియోగంపై పన్నును విధించాలని ఉగాండా అధ్యక్షుడు ముసెవెనీ ఈ ఏడాది మార్చిలో నిర్ణయించారు. ఈ మేరకు రోజుకు 200 షిల్లింగ్ల చొప్పును పన్ను విధించాలని ఆర్థికశాఖ, రెవెన్యూ శాఖలను ఆదేశిస్తూ అప్పట్లో లేఖ కూడా రాశారు. అయితే విద్యాపరమైన అవసరాల కోసం సోషల్మీడియాను ఉపయోగించుకునే వారికి మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు కల్పించాలని సూచించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఉగాండా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రభుత్వం ఆదాయంగా మలుచుకొంటోందని విమర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







