20 గంటలు ఆలస్యంగా వెళ్లిన అల్‌ జజీరా విమానం

- July 04, 2018 , by Maagulf
20 గంటలు ఆలస్యంగా వెళ్లిన అల్‌ జజీరా విమానం

శంషాబాద్‌:శంషాబాద్‌ నుంచి కువైట్‌కు వెళ్లాల్సిన ఓ విమానం 20 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో 65 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 2.20గంటలకు జే9-609 అల్‌జజీరా ఎయిర్‌లైన్స్‌ విమానం శంషాబాద్‌ నుంచి కువైట్‌కు వెళ్లాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల ఆ విమానం కువైట్‌ నుంచి శంషాబాద్‌కే రాలేదు. దీంతో ఇక్కడి నుంచి కువైట్‌ వెళ్లేందుకు బోర్డింగ్‌ పాసులు తీసుకున్న ప్రయాణికులను సాయంత్రం రావాలని అధికారులు సూచించడంతో కొందరు వెనుదిరిగి వెళ్లగా.. చాలామంది విమానాశ్రయం ఆవరణలో పడిగాపులు కాశారు. సాయంత్రం వచ్చిన ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆందోళనకు దిగారు. స్పందించిన ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం ఎట్టకేలకు రాత్రి 9.30గంటలకు ప్రయాణికులను కువైట్‌కు పంపించడంతో వివాదం సద్దుమణిగింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com