20 గంటలు ఆలస్యంగా వెళ్లిన అల్ జజీరా విమానం
- July 04, 2018
శంషాబాద్:శంషాబాద్ నుంచి కువైట్కు వెళ్లాల్సిన ఓ విమానం 20 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో 65 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 2.20గంటలకు జే9-609 అల్జజీరా ఎయిర్లైన్స్ విమానం శంషాబాద్ నుంచి కువైట్కు వెళ్లాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల ఆ విమానం కువైట్ నుంచి శంషాబాద్కే రాలేదు. దీంతో ఇక్కడి నుంచి కువైట్ వెళ్లేందుకు బోర్డింగ్ పాసులు తీసుకున్న ప్రయాణికులను సాయంత్రం రావాలని అధికారులు సూచించడంతో కొందరు వెనుదిరిగి వెళ్లగా.. చాలామంది విమానాశ్రయం ఆవరణలో పడిగాపులు కాశారు. సాయంత్రం వచ్చిన ప్రయాణికులకు ఎయిర్లైన్స్ ప్రతినిధులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆందోళనకు దిగారు. స్పందించిన ఎయిర్లైన్స్ యాజమాన్యం ఎట్టకేలకు రాత్రి 9.30గంటలకు ప్రయాణికులను కువైట్కు పంపించడంతో వివాదం సద్దుమణిగింది
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







