వైఎస్ఆర్ బయోపిక్ 'యాత్ర' టీజర్ విడుదల తేదీ ఖరారు!
- July 04, 2018
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఎన్టీఆర్ బయోపిక్ కు రంగం సిద్ధం అవుతుండడం, మరో వైపు వైఎస్ఆర్ బయో పిక్ వస్తుండడంతో సినీ రాజకీయా వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఇటీవల కేసీఆర్ బయోపిక్ చిత్రం కూడా ప్రారంభం అయింది.
ఇదిలా ఉండగా యాత్ర చిత్రాన్ని కేవలం ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయనున్నారు. వైఎస్ ఆర్ జయంతి జులై 8 న యాత్ర చిత్ర టీజర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. జగపతి బాబు, రావు రమేష్, అనసూయ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
మహి వి. రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. వైఎస్ఆర్ జీవితంలో చోటు చేసుకున్న కెలక ఘట్టాలు, ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనం తదితర అంశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







