హూరాలో వలసదారుడి హత్య
- July 05, 2018
బహ్రెయిన్:భారతీయ వలసదారుడొకరు హూరాలోని ఓ అపార్ట్మెంట్లో హత్య చేయబడ్డాడు. కేరళకు చెందిన అబ్దుల్ నహాస్, ఎగ్జిబిషన్ రోడ్లోని తన ఇంట్లో రక్తపు మడుగులో నిర్జీవంగా పడివుండడాన్ని గుర్తించారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్గ్కి తరలించారు. పోలీస్ టీమ్, మృతుడి సమాచారం కోసం అక్కడి పరిసర ప్రాంతాలవారిని విచారించారు. ఫోరెన్సిక్ టీమ్ రంగంలోకి దిగి, కొన్ని ఆధారాల్ని సేకరించింది. నాలుగేళ్ళ క్రితం అబ్దుల్, బహ్రెయిన్కి వచ్చాడని పోలీసులు గుర్తించారు. అతనికి తల్లి రమ్లా, తలండ్రి, అబ్దుల్లా కుట్టీ, సోదరుడు అనాస్, సోదరి నజామ్మ ఉన్నారు. మృతుడి బంధువు సహీర్ మాట్లాడుతూ, ఈ ఘటన తమకు షాక్ లాంటిదని అన్నాడు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని సహీర్ కోరారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









