హూరాలో వలసదారుడి హత్య
- July 05, 2018
బహ్రెయిన్:భారతీయ వలసదారుడొకరు హూరాలోని ఓ అపార్ట్మెంట్లో హత్య చేయబడ్డాడు. కేరళకు చెందిన అబ్దుల్ నహాస్, ఎగ్జిబిషన్ రోడ్లోని తన ఇంట్లో రక్తపు మడుగులో నిర్జీవంగా పడివుండడాన్ని గుర్తించారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్గ్కి తరలించారు. పోలీస్ టీమ్, మృతుడి సమాచారం కోసం అక్కడి పరిసర ప్రాంతాలవారిని విచారించారు. ఫోరెన్సిక్ టీమ్ రంగంలోకి దిగి, కొన్ని ఆధారాల్ని సేకరించింది. నాలుగేళ్ళ క్రితం అబ్దుల్, బహ్రెయిన్కి వచ్చాడని పోలీసులు గుర్తించారు. అతనికి తల్లి రమ్లా, తలండ్రి, అబ్దుల్లా కుట్టీ, సోదరుడు అనాస్, సోదరి నజామ్మ ఉన్నారు. మృతుడి బంధువు సహీర్ మాట్లాడుతూ, ఈ ఘటన తమకు షాక్ లాంటిదని అన్నాడు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని సహీర్ కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







