జనవరి 1 నుంచి 466,000 మందిని ఎట్రాక్ట్ చేసిన దుబాయ్ ఫ్రేమ్
- July 06, 2018
దుబాయ్ ఫ్రేమ్కి జనవరి 1 నుంచి ఇప్పటిదాకా వచ్చిన విజిటర్స్ సంఖ్య 466,000కి పైగానే వుందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. బుధవారం ఈ ఎట్రాక్షన్ కోసం కొత్తగా ఇ-టికెటింగ్ సిస్టమ్ని లాంఛ్ చేశారు. విజిటర్స్ తమ విజిట్ వీసా ఆధారంగా దుబాయ్ ఫ్రేమ్ని తిలకించేందుకు డేట్, టైమ్ ఎంచుకోవచ్చని, స్మార్ట్ ఫోన్ యాప్ ఇందుకు ఉపకరిస్తుందని అధికారులు వివరించారు. అవార్డ్ విన్నింగ్ ఆర్కిటెక్ట్ ఫెర్నాండో డోనిస్ డిజైన్ చేసిన ఈ స్ట్రక్చర్ ప్రపంచ వ్యాప్తంగా తక్కువ కాలంలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. జబెల్ పార్క్లో ఈ దుబాయ్ ఫ్రేమ్ని ఏర్పాటు చేశారు. లామినేటెడ్ గ్లాస్తో 2,900 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని నిర్మించారు. ఏడాదికి 2 మిలియన్పైగా విజిటర్స్ వస్తారని ముందుగా అంచనా వేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!