జనవరి 1 నుంచి 466,000 మందిని ఎట్రాక్ట్ చేసిన దుబాయ్ ఫ్రేమ్
- July 06, 2018
దుబాయ్ ఫ్రేమ్కి జనవరి 1 నుంచి ఇప్పటిదాకా వచ్చిన విజిటర్స్ సంఖ్య 466,000కి పైగానే వుందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. బుధవారం ఈ ఎట్రాక్షన్ కోసం కొత్తగా ఇ-టికెటింగ్ సిస్టమ్ని లాంఛ్ చేశారు. విజిటర్స్ తమ విజిట్ వీసా ఆధారంగా దుబాయ్ ఫ్రేమ్ని తిలకించేందుకు డేట్, టైమ్ ఎంచుకోవచ్చని, స్మార్ట్ ఫోన్ యాప్ ఇందుకు ఉపకరిస్తుందని అధికారులు వివరించారు. అవార్డ్ విన్నింగ్ ఆర్కిటెక్ట్ ఫెర్నాండో డోనిస్ డిజైన్ చేసిన ఈ స్ట్రక్చర్ ప్రపంచ వ్యాప్తంగా తక్కువ కాలంలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. జబెల్ పార్క్లో ఈ దుబాయ్ ఫ్రేమ్ని ఏర్పాటు చేశారు. లామినేటెడ్ గ్లాస్తో 2,900 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని నిర్మించారు. ఏడాదికి 2 మిలియన్పైగా విజిటర్స్ వస్తారని ముందుగా అంచనా వేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







