నేషనల్ డే ఉల్లంఘనలు: 427 కార్ల స్వాధీనం
- December 12, 2015
నేషనల్ డే సెలబ్రేషన్స్ నేపథ్యంలో అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ట్రాఫిక్ ఇబ్బందులు పెద్దగ తలెత్తలేదు. అన్ని చోట్లా తగిన విధంగా సిబ్బందిని నియమించడం, అలాగే నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై నిఘా పెట్టడం ద్వారా ఉల్లంఘనల్ని చాలావరకు తగ్గించగలిగారు. అయితే నిబంధనల్ని ఉల్లంఘించిన 427 కార్లను మాత్రం ట్రాఫిక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ చట్టాలను లెక్క చేయకుండా కార్లను డెకరేషన్ చేయడం, మితిమీరిన శబ్దంతో హారన్ మోగించడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి చర్యలకు పాల్పడినందుకు ఆ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబుదాబీ పోలీస్, ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ హుస్సేన్ అహ్మద్ అల్ హరితి మాట్లాడుతూ, ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాల్సిందేనని చెప్పారాయన. వాహనదారులు తమ వాహనాలకు ఏర్పాటు చేసిన డెకరేషన్లను తొలగించాలనీ, లేదంటే ఫైన్ విధింపబడ్తాయని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల, రోడ్లపై వాహనదారుల భద్రత పట్ల అవగాహన కల్గించే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతోంది ట్రాఫిక్ విభాగం.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







