సలాలా టూరిజం ఫెస్టివల్ 2018 ప్రారంభం
- July 11, 2018
మస్కట్: సలాలా టూరిజం ఫెస్టివల్ 2018 యాక్టివిటీస్ ప్రారంభమయ్యాయి. సలాలా మునిసిపాలిటీ రిక్రియేషనల్ సెంటర్లో ఈ టూరిజం ఫెస్టివల్ సందర్శకుల్ని అలరిస్తోంది. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఈ ఫెస్టివల్ని ఆస్వాదించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెల్లడించింది. జూన్ 21 నుంచి జులై 3 వరకు దోఫార్లో పర్యటించిన టూరిస్టుల సంఖ్య 52,017కి చేరుకుంది. గత ఏడాది ఇదే పీరియడ్లో 38,404 మంది టూరిస్టులు వచ్చారు. ఆ రకంగా చూస్తే ఈ ఏడాది 35.4 శాతం పెరుగుదల నమోదయ్యింది. సలాలాలో ప్రముఖ నగరమైన దోఫార్, ఖరీఫ్ సీజన్లో మరింత ఆకర్షణీయంగా మారుతుంది. యాన్యువల్ ఖరీఫ్ ఫశ్రీస్టివల్లో సంప్రదాయ ప్రదర్శనలు, స్థానిక హ్యాండిక్రాఫ్ట్స్ని విక్రయించే స్టాల్స్, ఒమనీ కలినరీ డిలైట్స్ ఈ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణలు. ఈ ఫెస్టివల్ కోసం ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







