సలాలా టూరిజం ఫెస్టివల్ 2018 ప్రారంభం
- July 11, 2018
మస్కట్: సలాలా టూరిజం ఫెస్టివల్ 2018 యాక్టివిటీస్ ప్రారంభమయ్యాయి. సలాలా మునిసిపాలిటీ రిక్రియేషనల్ సెంటర్లో ఈ టూరిజం ఫెస్టివల్ సందర్శకుల్ని అలరిస్తోంది. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఈ ఫెస్టివల్ని ఆస్వాదించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెల్లడించింది. జూన్ 21 నుంచి జులై 3 వరకు దోఫార్లో పర్యటించిన టూరిస్టుల సంఖ్య 52,017కి చేరుకుంది. గత ఏడాది ఇదే పీరియడ్లో 38,404 మంది టూరిస్టులు వచ్చారు. ఆ రకంగా చూస్తే ఈ ఏడాది 35.4 శాతం పెరుగుదల నమోదయ్యింది. సలాలాలో ప్రముఖ నగరమైన దోఫార్, ఖరీఫ్ సీజన్లో మరింత ఆకర్షణీయంగా మారుతుంది. యాన్యువల్ ఖరీఫ్ ఫశ్రీస్టివల్లో సంప్రదాయ ప్రదర్శనలు, స్థానిక హ్యాండిక్రాఫ్ట్స్ని విక్రయించే స్టాల్స్, ఒమనీ కలినరీ డిలైట్స్ ఈ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణలు. ఈ ఫెస్టివల్ కోసం ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!