సలాలా టూరిజం ఫెస్టివల్ 2018 ప్రారంభం
- July 11, 2018
మస్కట్: సలాలా టూరిజం ఫెస్టివల్ 2018 యాక్టివిటీస్ ప్రారంభమయ్యాయి. సలాలా మునిసిపాలిటీ రిక్రియేషనల్ సెంటర్లో ఈ టూరిజం ఫెస్టివల్ సందర్శకుల్ని అలరిస్తోంది. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఈ ఫెస్టివల్ని ఆస్వాదించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెల్లడించింది. జూన్ 21 నుంచి జులై 3 వరకు దోఫార్లో పర్యటించిన టూరిస్టుల సంఖ్య 52,017కి చేరుకుంది. గత ఏడాది ఇదే పీరియడ్లో 38,404 మంది టూరిస్టులు వచ్చారు. ఆ రకంగా చూస్తే ఈ ఏడాది 35.4 శాతం పెరుగుదల నమోదయ్యింది. సలాలాలో ప్రముఖ నగరమైన దోఫార్, ఖరీఫ్ సీజన్లో మరింత ఆకర్షణీయంగా మారుతుంది. యాన్యువల్ ఖరీఫ్ ఫశ్రీస్టివల్లో సంప్రదాయ ప్రదర్శనలు, స్థానిక హ్యాండిక్రాఫ్ట్స్ని విక్రయించే స్టాల్స్, ఒమనీ కలినరీ డిలైట్స్ ఈ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణలు. ఈ ఫెస్టివల్ కోసం ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







