వ్యాట్పై కొత్త రూల్ ప్రకటించిన యు.ఏ.ఈ
- July 11, 2018యు.ఏ.ఈ:వాల్యూ యాడెడ్ ట్యాక్స్కి సంబంధించి రిఫండ్ సిస్టమ్ని పర్యాటకుల కోసం తీసుకొస్తున్నారు. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. టూరిజం సెక్టార్ అభివృద్ధి కోసం కొత్త ట్యాక్స్ రిఫండ్ సిస్టమ్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2018 ఫోర్ట్ క్వార్టర్లో ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఇంటర్నేషనల్ స్పెషలైజ్డ్ కంపెనీ - ట్యాక్స్ రికవరీ సర్వీసెస్ సహకారంతో దీన్ని అమలు చేస్తారు. నాన్ రెసిడెంట్ టూరిస్ట్లు వ్యాట్ని రిఫండ్ పొందేందుకు ఈ విధానం అనుమతిస్తుంది. అయితే కొనుగోళ్ళ ద్వారా మాత్రమే దీన్ని రిఫండ్ పొందవచ్చు. లోకల్ ఎకానమీకి డైరెక్ట్గా టూరిజం సెక్టార్ ఉపకరిస్తుంది. యూఏఈ ఎయిర్పోర్ట్స్ ద్వారా 2017లో మొత్తం 123 మిలియన్ ప్రయాణీకులు ప్రయాణించారు. దేశ జీడీపీలో టూరిజం వాటా 11.3 శాతం. దీని విలువ మొత్తంగా 154.1 బిలియన్ దిర్హామ్లు.
తాజా వార్తలు
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన