తప్పును సరిదిద్దుకున్నఇరాన్..భారత్ తలొగ్గుతోందంటూ..
- July 12, 2018
            అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గుతోందని ఇరాన్ ఆరోపణలు చేసింది. చమురు దిగుమతిని తగ్గించుకుంటే ప్రత్యేక హక్కులు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించిన మరుసటి రోజే తన వాదనను వెనక్కు తీసుకుంది. ట్రంప్ ఆంక్షలతో భారత్ సహా చాలా దేశాలు ప్రభావితమవుతున్నాయని భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా తగ్గించుకోవాలని భారత్ సహా పలు దేశాలను అమెరికా ఆదేశించింది. నవంబర్ 4 నాటికి చమురు దిగుమతులు జీరో అవ్వాలని, లేకపోతే పలు ఆంక్షలు తప్పవని హెచ్చరికలు చేసింది. దీంతో ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ రాయబారి భారత్పై అసహనం వ్యక్తం చేశారు. అయితే తాజాగా తన తప్పును సరిదిద్దుకున్నారు. భారత్కు చమురు దిగుమతి విషయంలో తమ వంతు పాత్రను బాధ్యతగా వ్యవహరిస్తామని చెప్పారు. భారత్తో తమకు ఎప్పుడూ మంచి బంధాలే ఉన్నాయని ఇరాన్ రాయబారి క్లారిటీ ఇచ్చారు.
తాజా వార్తలు
- లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







