అరుణ గ్రహంపై తొలి అడుగు పెట్టనున్న మహిళ

- July 12, 2018 , by Maagulf
అరుణ గ్రహంపై తొలి అడుగు పెట్టనున్న మహిళ

అమెరికా బాలిక అలెసా కార్సన్‌(17) అరుణ గ్రహంపై కాలు మోపబోయే తొలి మహిళ కానుంది. ఆమెకు 32 ఏళ్ళ వయసు వచ్చాక 2033లో వెళ్ళనుంది. ఇందు కోసం కార్సన్‌ నాసా పోలార్‌ ఆర్బిటల్‌ సైన్స్, జీరో గ్రావిటీ, అండర్‌వాటర్‌ సర్వైవల్‌లో ప్రాథమిక శిక్షణ తీసుకుంటోంది. ఇప్పుడామె 'బ్లూ బెర్రీ' అనే కోడ్‌నేమ్‌తో కొనసాగుతోంది. చిన్నతనం నుంచే నాసా అంతరిక్ష కేంద్రాలను సందర్శించడం అలవాటుగా మార్చుకున్న అలెసా వ్యోమగామిగా అరుణగ్రహం నుంచి తిరిగొచ్చాక, అధ్యాపకురాలిగా ఆ తర్వాత దేశాధ్యక్షురాలిగా కావాలనుకుంటున్నట్లు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com