ట్రంప్కు భారత్ ఆహ్వానం
- July 12, 2018
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను భారత్ ఆహ్వానించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని చెప్పడానికి అనుగుణంగానే ట్రంప్ను భారత్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయానికి అమెరికా దౌత్య అధికారులతో పలుమార్లు చర్చలు జరిపిన తరవాత ట్రంప్కు ఆహ్వానం పంపారు. అమెరికా నుంచి దీనికి అధికారికంగా జవాబు రావాల్సి ఉంది.
ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ లాంఛనమేనని, అన్ని రకాల ముందుస్తు చర్చలు జరిపిన తర్వాతే ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. 2015 రిపబ్లిక్ డేకి అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరైన సంగతి తెలిసిందే. ఇటీవల వివిధ దేశాలతో వాణిజ్య విషయాల్లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్.. భారత్ను సైతం టార్గెట్ చేసినప్పటికీ, మోదీ ఆహ్వానాన్ని అంగీకరించే అవకాశాలు అధికంగా ఉన్నట్లు దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









