అప్ఘన్ ఆర్మీ ఆపరేషన్‌..10 మంది పౌరులు మృతి

- July 13, 2018 , by Maagulf
అప్ఘన్ ఆర్మీ ఆపరేషన్‌..10 మంది పౌరులు మృతి

కాబూల్ : తాలిబన్లను మట్టుకరిపించేందుకు ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌లో 10 మంది అప్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అప్ఘన్ ప్రొవిన్షియల్ కౌన్సిల్ సభ్యుడు. అజ్మల్ ఒమర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఖోగ్యాని జిల్లాలో నిన్న రాత్రి చేపట్టిన ఆర్మీ ఆపరేషన్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో దుకాణాల్లో నిద్రిస్తున్న గుమాస్తాలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆర్మీ ఆపరేషన్‌లో ముగ్గురు అక్రమ చొరబాటు దారులను అదుపులోకి తీసుకున్నామని మరో ఉన్నతాధికారి అత్తావుల్లా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com