సిరియాలో వైమానిక దాడులు

- July 13, 2018 , by Maagulf
సిరియాలో వైమానిక దాడులు

సిరియాలో మరోసారి వైమానిక దాడుల్లో 28 మంది పౌరులు మృతిచెందారు... డీర్ ఇజార్ నగరంపై జరిగిన వైమానిక దాడుల్లో 28 మంది పౌరులు ప్రాణాలు వదిలారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉంటున్న స్థావరాలను టార్గెట్ చేసి వైమానిక దాడుల్లో అమాయకులు బలయ్యారు. ఇరాక్ సరిహద్దులోని అల్ సౌసా గ్రామంలో ఉన్న ఐస్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న పౌరులపై వైమానిక దాడి జరిగినట్ల సిరియా అబ్జర్వేటరీ తెలిపింది. అయితే దాడులు చేసింది ఇరాకీ విమానమా లేక అమెరికా సంకీర్ణ దళాలా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఇటీవల ఇరాక్ యుద్ధ విమానాలు తూర్పు సిరియాలో దాడులు నిర్వహించాయి... ఇక లోకల్ మీడియా ప్రకారం ఈ దాడుల్లో అమెరికా సంకీర్ణ దళాలే చేశాయని... 30 మంది వరకు మృతిచెందారని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com