మానవ అవయవాల వ్యాపారం..37 మందికి జైలుశిక్ష
- July 13, 2018
కైరో: అక్రమంగా మానవ అవయవాల వ్యాపారంలో భాగస్వామ్యమైన 37మందికి ఈజిప్ట్ కోర్టు జైలుశిక్ష విధించింది. అవయవ వ్యాపారంలో పాల్గొన్నవారికి కైరో క్రిమినల్ కోర్టు మూడేళ్ల నుంచి గరిష్టంగా 15 ఏండ్ల వరకు జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఆరుగురికి 15 ఏండ్లు, 11 మందికి ఏడేళ్లు, 20 మందికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా నిర్దారించారు.
డాక్లర్లు, వైద్య విభాగంలో పనిచేసే సిబ్బంది, మధ్యవర్తులు అక్రమ అవయవ మార్పిడి, అవయవాల వాణిజ్య కార్యకలాపాల్లో పాల్గొన్నారని దర్యాప్తులో తేలినట్లు అధికారులు తెలిపారు. పేద ఈజిప్షియన్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అవయవ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తేలింది. 2010 చట్టం ప్రకారం మావన అవయవాలను అమ్మడం నేరం. అయితే కడుపేదరికం కారణంగా కొందరు ఈజిప్షియన్లు వారి అవయవాలను అమ్ముకుంటున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక









