మానవ అవయవాల వ్యాపారం..37 మందికి జైలుశిక్ష
- July 13, 2018
కైరో: అక్రమంగా మానవ అవయవాల వ్యాపారంలో భాగస్వామ్యమైన 37మందికి ఈజిప్ట్ కోర్టు జైలుశిక్ష విధించింది. అవయవ వ్యాపారంలో పాల్గొన్నవారికి కైరో క్రిమినల్ కోర్టు మూడేళ్ల నుంచి గరిష్టంగా 15 ఏండ్ల వరకు జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఆరుగురికి 15 ఏండ్లు, 11 మందికి ఏడేళ్లు, 20 మందికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా నిర్దారించారు.
డాక్లర్లు, వైద్య విభాగంలో పనిచేసే సిబ్బంది, మధ్యవర్తులు అక్రమ అవయవ మార్పిడి, అవయవాల వాణిజ్య కార్యకలాపాల్లో పాల్గొన్నారని దర్యాప్తులో తేలినట్లు అధికారులు తెలిపారు. పేద ఈజిప్షియన్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అవయవ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తేలింది. 2010 చట్టం ప్రకారం మావన అవయవాలను అమ్మడం నేరం. అయితే కడుపేదరికం కారణంగా కొందరు ఈజిప్షియన్లు వారి అవయవాలను అమ్ముకుంటున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!







