ఖతార్‌:రన్‌వేపై జారిన విమానం.. తప్పిన పెను ప్రమాదం

- July 13, 2018 , by Maagulf
ఖతార్‌:రన్‌వేపై జారిన విమానం.. తప్పిన పెను ప్రమాదం

ఖతార్‌లోని దోహ నుంచి కొచ్చి వచ్చిన విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానంలో 306 మంది ప్రయాణికు ఉన్నారు. ల్యాండ్‌ అయ్యే సమయంలో రన్‌వేపై విమానం జారింది. చాకచక్యంగా వ్యవహరించి విమాన పైలెట్లు ఎటువంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని ల్యాండ్‌ చేశారు. వర్షం కారణంగా రన్‌వే బాగా తడిసి నీరు నిలిచిపోయి ఉండటంతో విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో జారినట్లు అధికారులు చెబుతున్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com