రాణిని అవమానించిన ట్రంప్
- July 14, 2018
ప్రొటోకాల్ పక్కనపెట్టి.. రాణి కంటే ముందు నడిచి బ్రిటన్లో ఇబ్బందికరంగా ట్రంప్ వ్యవహారశైలి లండన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ వాసుల ఆగ్రహంలో మరింత ఆజ్యం పోశారు. ట్రంప్ ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ట్రంప్కు వ్యతిరేకంగా చాలా మంది ఆందోళన చేస్తున్నారు. ట్రంప్తో రాణి ఎలిజెబెత్ భేటీని అత్యధిక మంది బ్రిటన్ వాసులు వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్, క్వీన్ ఎలిజెబెత్-2లు శుక్రవారం తొలిసారిగా సమావేశమయ్యారు. రాజవంశానికి చెందిన విండ్సర్ క్యాసిల్ కోటలో నిర్వహించిన తేనీటి విందులో ట్రంప్ పాల్గొన్నారు. అయితే ట్రంప్ రాణిని కలవగానే కేవలం షేక్హ్యాండ్ మాత్రమే ఇచ్చారు. ఆమె ఎదుట గౌరవ పూర్వకంగా తలను వంచలేదు. ప్రొటోకాల్ ప్రకారం రాణి ఎదుట తల వంచాలి. ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కూడా తలను వంచలేదు. అంతేకాకుండా ట్రంప్ విండ్సర్ క్యాసిల్కు నిర్ణీత సమయానికి రాలేదు.
దాదాపు 12 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. దీంతో అంతసేపు 92ఏళ్ల ఎలిజెబెత్ వారిని ఆహ్వానించేందుకు విండ్సర్ క్యాసిల్ వెలుపల వేచి ఉండాల్సి వచ్చింది. ట్రంప్ విండ్సర్ క్యాసిల్లో సైనికుల గౌరవ వందనం స్వీకరించే సమయంలోనూ రాణి పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించారు. ఆమె కంటే ముందు నడవడమే కాకుండా ఆమెకు దారి ఇవ్వకుండా అటు ఇటూ నడిచారు.
దీంతో రాణి కూడా తడబడ్డారు. ప్రొటోకాల్ ప్రకారం రాణికి ముందుగా నడవకూడదు. కానీ ట్రంప్ మాత్రం ఆ నిబంధనను ఏమాత్రం పట్టించుకోకుండా చక్కగా ముందు నడుచుకుంటూ వచ్చేశారు. బ్రిటన్ వాసులు ఎంతో గౌరవించే మహారాణి పట్ల ట్రంప్ ప్రొటోకాల్ పాటించకపోవడంపై అక్కడి ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ను తిడుతూ చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. స్కాట్లాండ్కు చేరుకున్న ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ పర్యటన అనంతరం స్కాంట్లాండ్కు వెళ్లారు. అక్కడ కూడా వేలాది మంది ప్రజలు ట్రంప్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనల నడుమే ఆయన ఆ దేశంలో అడుగుపెట్టారు.
ఇది ట్రంప్ వ్యక్తిగత పర్యటన. ట్రంప్ తల్లి స్కాట్లాండ్కు చెందిన వ్యక్తి. ఈ వారాంతాన్ని ఆయన ఐర్షైర్లోని తన టర్న్బెర్రీ గోల్ఫ్ రిసార్ట్లో గడపనున్నారు. అయితే ట్రంప్ స్కాట్లాండ్కు రావడంపై గ్లాస్గోలో ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







