రన్వే పై జారిన ఫ్లైట్
- July 14, 2018
కొచ్చి: ఖతార్లోని దోహ నుండి 306 మంది ప్రయాణికులతో బయలు దేరిన విమానం కొచ్చిలో ల్యాండ్ అయ్యే సమయంలో రన్వేపై జారినట్లు అధికారులు తెలిపారు. వర్షం కారణంగా రన్వే తడిసి నీరు నిలిచిపోయి ఉండటంతో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో జారినట్లు అధికారులు పేర్కొన్నారు. విమాన పైలెట్లు ఎటువంటి ప్రమాదం జరగకుండా చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేసినట్లు తెలిపారు. రన్వేపై పక్కగా ఉన్న పన్నెండు విద్యుత్ దీపాలు దెబ్బతిన్నాయని, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు ఖతార్ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. దీంతో దుబాయ్ వెళ్లాల్సిన రెండు విమానాలు ఆలస్యమైనట్లు తెలిపారు. ప్రమాదం కారణంగా విమానాన్ని రద్దు చేసి అందులో ప్రయాణించాల్సిన వారికి వేరే విమానాన్ని కేటాయించినట్లు ఖతార్ ఎయిర్లైన్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







