రన్వే పై జారిన ఫ్లైట్
- July 14, 2018కొచ్చి: ఖతార్లోని దోహ నుండి 306 మంది ప్రయాణికులతో బయలు దేరిన విమానం కొచ్చిలో ల్యాండ్ అయ్యే సమయంలో రన్వేపై జారినట్లు అధికారులు తెలిపారు. వర్షం కారణంగా రన్వే తడిసి నీరు నిలిచిపోయి ఉండటంతో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో జారినట్లు అధికారులు పేర్కొన్నారు. విమాన పైలెట్లు ఎటువంటి ప్రమాదం జరగకుండా చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేసినట్లు తెలిపారు. రన్వేపై పక్కగా ఉన్న పన్నెండు విద్యుత్ దీపాలు దెబ్బతిన్నాయని, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు ఖతార్ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. దీంతో దుబాయ్ వెళ్లాల్సిన రెండు విమానాలు ఆలస్యమైనట్లు తెలిపారు. ప్రమాదం కారణంగా విమానాన్ని రద్దు చేసి అందులో ప్రయాణించాల్సిన వారికి వేరే విమానాన్ని కేటాయించినట్లు ఖతార్ ఎయిర్లైన్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..