రన్వే పై జారిన ఫ్లైట్

- July 14, 2018 , by Maagulf
రన్వే పై జారిన ఫ్లైట్

కొచ్చి: ఖతార్‌లోని దోహ నుండి 306 మంది ప్రయాణికులతో బయలు దేరిన విమానం కొచ్చిలో ల్యాండ్‌ అయ్యే సమయంలో రన్‌వేపై జారినట్లు అధికారులు తెలిపారు. వర్షం కారణంగా రన్‌వే తడిసి నీరు నిలిచిపోయి ఉండటంతో విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో జారినట్లు అధికారులు పేర్కొన్నారు. విమాన పైలెట్లు ఎటువంటి ప్రమాదం జరగకుండా చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్‌ చేసినట్లు తెలిపారు. రన్‌వేపై పక్కగా ఉన్న పన్నెండు విద్యుత్‌ దీపాలు దెబ్బతిన్నాయని, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు ఖతార్‌ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. దీంతో దుబాయ్ వెళ్లాల్సిన రెండు విమానాలు ఆలస్యమైనట్లు తెలిపారు. ప్రమాదం కారణంగా విమానాన్ని రద్దు చేసి అందులో ప్రయాణించాల్సిన వారికి వేరే విమానాన్ని కేటాయించినట్లు ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com