రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి
- July 14, 2018
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సిఫారసు మేరకు నలుగురు ప్రముఖులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యాగంలోని ఆర్టికల్ 80 ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకు 12మందిని నామినేట్ చేసే అవకాశం ఉంది. కళ, సాంఘీక సేవలలో ప్రత్యేక అనుభ వం , ఆచరణాత్మక అనుభవం కలిగిన వ్యక్తులను సభకు నామినేట్ చేయవచ్చు. ఇలా నామినేట్ అయిన సభ్యులకు ఆరేళ్ల వ్యవధి ఉంటుంది. కాగా, రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులలో యుపి మాజీ బిజెపి ఎంపి, దళిత నాయకుడు రామ్ షకల్, ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు రాకేశ్ సిన్హా, శాస్త్రీయ నృత్యకారుడు సోనాల్ మాన్సింగ్, కళాకారుడు రఘునాథ్ మహాపాత్ర తదితరులు ఉన్నారు. రఘునాథ్ మహాపాత్ర గత ఆరు దశాబ్దాలుగా భరత నాట్యం, ఒడిస్సి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. రాకేశ్ సిన్హా ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఇండియా పాలసీ ఫౌండేషన్ను స్థాపించారు. ప్రస్తుతం సదరు సంస్థకు గౌరవ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







