40 రోజులు లాక్ అయిన ప్రభాస్
- July 15, 2018
బాహుబలి చిత్రం తో దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం 'రన్ రాజా రన్' ఫెమ్ సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా , బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. గత నెల క్రితం దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ , మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్ దాదాపు 40 రోజుల పాటు జరుగనుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేస్తారని సమాచారం. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్ -లాయ్ లు సంగీతం అందిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష







