40 రోజులు లాక్ అయిన ప్రభాస్
- July 15, 2018బాహుబలి చిత్రం తో దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం 'రన్ రాజా రన్' ఫెమ్ సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా , బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. గత నెల క్రితం దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ , మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్ దాదాపు 40 రోజుల పాటు జరుగనుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేస్తారని సమాచారం. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్ -లాయ్ లు సంగీతం అందిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు