అగ్ని ప్రమాదం: ముగ్గురికి గాయాలు
- July 19, 2018
మస్కట్:నిజ్వాలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ముగ్గరు వ్యక్తులు గాయపడ్డారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. గాయపడ్డవారిలో ఇద్దరు ఒమనీయులున్నారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్ని ప్రమాదం మరింత విస్తరించకుండా సివిల్ డిఫెన్స్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం కారణంగా కాలిన గాయాలతో వారు బాధపడుతున్నారు. తక్షణ వైద్య చికిత్స అందించడంతో వారికి ప్రాణాపాయం తప్పింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







