రోడ్డు ప్రమాదంలో బహ్రెయినీ డ్రైవర్ మృతి
- July 19, 2018
మనామా: షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవేపై బురి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బహ్రెయినీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. వాహనంపై డ్రైవర్ అదుపు కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైవేపై వున్న స్టీల్ ఫెన్స్పైకి వాహనం దూసుకుపోయింది. ప్రమాద సమయంలో కారు జిసిసి లైసెన్స్ ప్లేట్స్ కలిగి వుందనీ, ఈ ఘటనలో వేరే వాహనాల ప్రమేయం లేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పోలీస్ సకాలంలో అక్కడికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. సుమారు గంట వరకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ప్రమాదానికి గురైన కారుని అక్కడినుంచి తొలగించడంతో ట్రాఫిక్ అవాంతరాలు తగ్గాయి.
తాజా వార్తలు
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!









