బ్రేకింగ్ : 82మంది మహిళా ఖైదీలకు ఆస్వస్థత..
- July 20, 2018
82మంది మహిళా ఖైదీలు అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని బైకుళ్లా కారాగారంలో మహిళా ఖైదీలకు శుక్రవారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత వాంతులు విరోచనాలు అయ్యాయి. దీంతో వారిని ముంబైలోని జేజే హాస్పిటల్ కు తరలించారు. అపరిశుభ్రమైన నీటి కారణంగానే వారు అస్వస్థతకు గురై ఉంటారని డాక్టర్లు భావిస్తున్నారు. జైలు ఉన్నతాధికారి రాజ్వర్థన్ సిన్హా మాట్లాడుతూ.. మూడురోజుల క్రితం ఓ మగఖైదీకి కలరా రాగా వెంటనే మందులు ఇచ్చామని తెలిపారు. అయితే ఈ వ్యాధి ఇతరఖైదీలకు రాకుండా అందరికి మందులు అందజేశామన్నారు.కాగా మహిళా ఖైదీలు అస్వస్థతకు గురైన వెంటనే జైలులోని మిగితా అందరికి వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







